Telugu Global
NEWS

ఏబీ వెంకటేశ్వర రావుకు పదోన్నతి

వివాదాస్పద ఐపీఎస్ అధికారి, ఏపీ ఇంటెలిజెన్స్‌ ఐజీగా ఉన్న ఏబీ వెంకటేశ్వరరావుకు రాష్ట్ర ప్రభుత్వం పదోన్నతి కల్పించింది. వైసీపీ ఎమ్మెల్యేల కొనుగోలులో కీలక పాత్ర పోషించారని వైసీపీ నుంచి ఆరోపణలు ఎదుర్కొన్న వెంకటేశ్వరరావుకు… ఎన్నికల షెడ్యూల్‌ వస్తున్న నేపథ్యంలో హడావుడిగా పదోన్నతి కల్పించారు. అదనపు డీజీ స్థాయి నుంచి డీజీగా పదోన్నతి ఇచ్చారు. ఏబీ వెంకటేశ్వరరావుతో పాటు కేఆర్‌ఎం. కిషోర్ కుమార్‌, సీహెచ్‌. ద్వారకా తిరుమలరావులకు కూడా ఏడీజీ నుంచి డీజీలుగా పదోన్నతి కల్పించారు. వీరు ముగ్గురు […]

ఏబీ వెంకటేశ్వర రావుకు పదోన్నతి
X

వివాదాస్పద ఐపీఎస్ అధికారి, ఏపీ ఇంటెలిజెన్స్‌ ఐజీగా ఉన్న ఏబీ వెంకటేశ్వరరావుకు రాష్ట్ర ప్రభుత్వం పదోన్నతి కల్పించింది. వైసీపీ ఎమ్మెల్యేల కొనుగోలులో కీలక పాత్ర పోషించారని వైసీపీ నుంచి ఆరోపణలు ఎదుర్కొన్న వెంకటేశ్వరరావుకు… ఎన్నికల షెడ్యూల్‌ వస్తున్న నేపథ్యంలో హడావుడిగా పదోన్నతి కల్పించారు.

అదనపు డీజీ స్థాయి నుంచి డీజీగా పదోన్నతి ఇచ్చారు. ఏబీ వెంకటేశ్వరరావుతో పాటు కేఆర్‌ఎం. కిషోర్ కుమార్‌, సీహెచ్‌. ద్వారకా తిరుమలరావులకు కూడా ఏడీజీ నుంచి డీజీలుగా పదోన్నతి కల్పించారు. వీరు ముగ్గురు ప్రస్తుతం వారు పనిచేస్తున్న స్థానాల్లోనే డీజీ హోదాల్లో పనిచేస్తారని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.

First Published:  9 March 2019 8:18 PM GMT
Next Story