Telugu Global
NEWS

మాజీ జేడీ రాజకీయంపై అంబటి ఫైర్

సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ టీడీపీలో చేరేందుకు సిద్ధమవడంపై వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఫైర్ అయ్యారు. లక్ష్మీనారాయణ ముసుగు తొలగిపోయిందన్నారు. ఇంతకాలం చంద్రబాబు, లక్ష్మీనారాయణ కలిసే పనిచేశారన్న విషయం ఇప్పుడు అర్థమవుతోందన్నారు. లక్ష్మీనారాయణ భీమిలి నుంచి టీడీపీ తరపున పోటీ చేస్తున్నారని టీడీపీ పత్రిక వెల్లడించిన నేపథ్యంలో అంబటి స్పందించారు. జేడీ లక్ష్మీనారాయణ లోటస్‌ పాండ్‌లో అణువణువు వెతికి ఇక్కడ అనేక గదులు, లగ్జరీ సౌకర్యాలున్నాయని అసత్య ప్రచారం చేశారన్నారు. విచారణ సమయంలో అన్ని విషయాలు ఉదయమే ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికల్లో వచ్చేవని… లక్ష్మీనారాయణ […]

మాజీ జేడీ రాజకీయంపై అంబటి ఫైర్
X

సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ టీడీపీలో చేరేందుకు సిద్ధమవడంపై వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఫైర్ అయ్యారు. లక్ష్మీనారాయణ ముసుగు తొలగిపోయిందన్నారు. ఇంతకాలం చంద్రబాబు, లక్ష్మీనారాయణ కలిసే పనిచేశారన్న విషయం ఇప్పుడు అర్థమవుతోందన్నారు. లక్ష్మీనారాయణ భీమిలి నుంచి టీడీపీ తరపున పోటీ చేస్తున్నారని టీడీపీ పత్రిక వెల్లడించిన నేపథ్యంలో అంబటి స్పందించారు.

జేడీ లక్ష్మీనారాయణ లోటస్‌ పాండ్‌లో అణువణువు వెతికి ఇక్కడ అనేక గదులు, లగ్జరీ సౌకర్యాలున్నాయని అసత్య ప్రచారం చేశారన్నారు. విచారణ సమయంలో అన్ని విషయాలు ఉదయమే ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికల్లో వచ్చేవని… లక్ష్మీనారాయణ
లీక్ చేయడం వల్లే ఆ విషయాన్నీ పత్రికల్లో వచ్చేవన్నారు.

చంద్రబాబు ఏది చెబితే అది జేడీ చేశారని ఆరోపించారు. ఈ ఇద్దరు ఒక్కటేనని, రహస్యంగా మాట్లాడుకుంటున్నారని, వారి కాల్‌డేటా బయటకు తీయాలని ఆ రోజుల్లోనే తమ పార్టీ డిమాండ్‌ చేసిందన్నారు.

వైఎస్సార్‌సీపీని అంతమొందించాలని చాలా ప్రయత్నించారని, చంద్రబాబు, జేడీ తోడు దొంగల్లా వ్యవహరించారని మండిపడ్డారు. ఓటు ద్వారా ప్రజలు వీరిని శిక్షించాలని అంబటి కోరారు.

First Published:  12 March 2019 4:27 AM GMT
Next Story