Telugu Global
NEWS

ఇక్కడ ఒక్క నాయకుడు లేరా?- టీడీపీపై తోట వాణి ఫైర్

తూర్పుగోదావరి జిల్లాలో టీడీపీకి మరో బిగ్ షాక్ తగిలింది. కాకినాడ ఎంపీ తోట నరసింహం కుటుంబం టీడీపీని వీడింది. రేపు వైసీపీలో చేరుతున్నట్టు తోట నరసింహం భార్య వాణి చెప్పారు. టీడీపీలో తమకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. తన భర్తకు సముచిత స్థానం ఇవ్వలేదన్నారు. తన భర్త అనారోగ్యం కారణంగా తనకు అసెంబ్లీ టికెట్‌ ఇవ్వాల్సిందిగా కోరారని చెప్పారు. అయినా చంద్రబాబు స్పందించలేదన్నారు. పైగా చినరాజప్పతో చనిపోయిన తన తండ్రిపై విమర్శలు చేయించారన్నారు. తమకు సంస్కారం ఉంది కాబట్టి చినరాజప్పపై తిరిగి ఒక్క విమర్శ కూడా […]

ఇక్కడ ఒక్క నాయకుడు లేరా?- టీడీపీపై తోట వాణి ఫైర్
X

తూర్పుగోదావరి జిల్లాలో టీడీపీకి మరో బిగ్ షాక్ తగిలింది. కాకినాడ ఎంపీ తోట నరసింహం కుటుంబం టీడీపీని వీడింది. రేపు వైసీపీలో చేరుతున్నట్టు తోట నరసింహం భార్య వాణి చెప్పారు.

టీడీపీలో తమకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. తన భర్తకు సముచిత స్థానం ఇవ్వలేదన్నారు. తన భర్త అనారోగ్యం కారణంగా తనకు అసెంబ్లీ టికెట్‌ ఇవ్వాల్సిందిగా కోరారని చెప్పారు.

అయినా చంద్రబాబు స్పందించలేదన్నారు. పైగా చినరాజప్పతో చనిపోయిన తన తండ్రిపై విమర్శలు చేయించారన్నారు. తమకు సంస్కారం ఉంది కాబట్టి చినరాజప్పపై తిరిగి ఒక్క విమర్శ కూడా చేయలేదన్నారు.

కోనసీమకు చెందిన చినరాజప్పను తెచ్చి పెద్దాపురంలో పోటీ చేయించాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. ఇక్కడ ఒక్క నాయకుడు కూడా లేరా అని వాణి నిలదీశారు.

First Published:  12 March 2019 6:57 AM GMT
Next Story