Telugu Global
NEWS

విజయవాడ నుంచి పోటీ చేయమన్నారు " పీవీపీ

పారిశ్రామికవేత్త పీవీపీ వైసీపీలో చేరారు. విజయవాడకు చెందిన పలువురు ప్రముఖులతో కలిసి ఆయన జగన్‌ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. మాజీ మేయర్ రత్నబిందు కూడా ఆయనతో పాటు వైసీపీలో చేరారు. విజయవాడ ఎంపీగా పోటీ చేయాల్సిందిగా జగన్‌ ఆదేశించారని ఈ సందర్భంగా మీడియాతో పీవీపీ చెప్పారు. తాను పుట్టింది, పెరిగింది, చదువుకున్నది అంతా విజయవాడలోనే అన్నారు. తన ఎజెండా విజయవాడ అభివృద్ధి మాత్రమేనని… రాజకీయం కాదన్నారు. జగన్‌కు తనకు ఎప్పుడూ గ్యాప్ లేదన్నారు. విజయవాడలో ఈ ఐదేళ్లలో ఎలాంటి అభివృద్ధి జరిగిందో అందరికీ […]

విజయవాడ నుంచి పోటీ చేయమన్నారు  పీవీపీ
X

పారిశ్రామికవేత్త పీవీపీ వైసీపీలో చేరారు. విజయవాడకు చెందిన పలువురు ప్రముఖులతో కలిసి ఆయన జగన్‌ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. మాజీ మేయర్ రత్నబిందు కూడా ఆయనతో పాటు వైసీపీలో చేరారు.

విజయవాడ ఎంపీగా పోటీ చేయాల్సిందిగా జగన్‌ ఆదేశించారని ఈ సందర్భంగా మీడియాతో పీవీపీ చెప్పారు. తాను పుట్టింది, పెరిగింది, చదువుకున్నది అంతా విజయవాడలోనే అన్నారు. తన ఎజెండా విజయవాడ అభివృద్ధి మాత్రమేనని… రాజకీయం కాదన్నారు. జగన్‌కు తనకు ఎప్పుడూ గ్యాప్ లేదన్నారు.

విజయవాడలో ఈ ఐదేళ్లలో ఎలాంటి అభివృద్ధి జరిగిందో అందరికీ తెలుసన్నారు. ఇకపై సినిమా ఫంక్షన్‌ ఒకటి హైదరాబాద్‌లో చేస్తే మరొకటి విజయవాడలో చేసేలా ప్రయత్నాలు చేస్తానన్నారు. పవన్‌ కల్యాణ్‌తో సన్నిహితంగా ఉండి జనసేన వైపు వెళ్లకుండా వైసీపీ వైపు ఎందుకు వచ్చారని ప్రశ్నించగా… గత 15 ఏళ్లుగా స్థిరంగా తనకు స్నేహం ఉన్నది వైఎస్‌ జగన్‌తోనే అన్నారు.

First Published:  12 March 2019 11:57 PM GMT
Next Story