Telugu Global
NEWS

8 వేల పరుగులక్లబ్ లో రోహిత్ శర్మ

విరాట్, గంగూలీ తర్వాతి స్థానంలో రోహిత్ హామిల్టన్ వేదికగా కివీస్ పై రోహిత్ 200వ వన్డే 200 వన్డేలు ఆడిన 14వ భారత క్రికెటర్ రోహిత్ టీమిండియా వైస్ కెప్టెన్ కమ్ డాషింగ్ ఓపెనర్ రోహిత్ శర్మ…వన్డే క్రికెట్లో అత్యంతవేగంగా 8వేల పరుగులు సాధించిన మూడో క్రికెటర్ గా రికార్డుల్లో చేరాడు. న్యూఢిల్లీ ఫిరోజ్ షా కోట్లా స్టేడియం వేదికగా ఆస్ట్రేలియాతో ముగిసిన ఆఖరి, 5వ వన్డేలో ఫైటింగ్ హాఫ్ సెంచరీ సాధించడం ద్వారా…రోహిత్ ఈ ఘనతను […]

8 వేల పరుగులక్లబ్ లో రోహిత్ శర్మ
X
  • విరాట్, గంగూలీ తర్వాతి స్థానంలో రోహిత్
  • హామిల్టన్ వేదికగా కివీస్ పై రోహిత్ 200వ వన్డే
  • 200 వన్డేలు ఆడిన 14వ భారత క్రికెటర్ రోహిత్

టీమిండియా వైస్ కెప్టెన్ కమ్ డాషింగ్ ఓపెనర్ రోహిత్ శర్మ…వన్డే క్రికెట్లో అత్యంతవేగంగా 8వేల పరుగులు సాధించిన మూడో క్రికెటర్ గా రికార్డుల్లో చేరాడు.

న్యూఢిల్లీ ఫిరోజ్ షా కోట్లా స్టేడియం వేదికగా ఆస్ట్రేలియాతో ముగిసిన ఆఖరి, 5వ వన్డేలో ఫైటింగ్ హాఫ్ సెంచరీ సాధించడం ద్వారా…రోహిత్ ఈ ఘనతను సొంతం చేసుకొన్నాడు.

కొహ్లీ, గంగూలీల సరసన…

విరాట్ కొహ్లీ 175 ఇన్నింగ్స్ లోనే 8 వేల పరుగుల మైలురాయిని చేరితే…ఏబీ డివిలియర్స్ 182 ఇన్నింగ్స్ లోనూ, సౌరవ్ గంగూలీ 200 ఇన్నింగ్స్ లోనూ ఈ ఘనత సాధించారు.

రోహిత్ శర్మ సైతం 8వేల పరుగులు సాధించడానికి 200 ఇన్నింగ్స్ ఆడాల్సి వచ్చింది.142 ఇన్నింగ్స్ లో 5 వేల పరుగులు సాధించిన రోహిత్ …58 ఇన్నింగ్స్ లో మరో 3 వేల పరుగులు సాధించడం విశేషం.

బెల్ ఫాస్ట్ టు న్యూఢిల్లీ…

ఐర్లాండ్ ప్రత్యర్థిగా…బెల్ పాస్ట్ వేదికగా 2007 సిరీస్ ద్వారా వన్డే అరంగేట్రం చేసిన రోహిత్ శర్మ…ఆ తర్వాత నుంచి మరి వెనుదిరిగి చూసిందిలేదు. గత దశాబ్దకాలంగా టీమిండియా…. బ్యాట్ మ్యాన్ గా గుర్తింపు సంపాదించుకొన్నాడు.

అంతేకాదు…న్యూజిలాండ్ తో ముగిసిన … పాంచ్ పటాకా సిరీస్ లోని నాలుగో వన్డే ద్వారా…రెండు వందల వన్డే మ్యాచ్ లు ఆడిన రోహిత్… ఆసీస్ తో ముగిసిన ఐదుమ్యాచ్ ల సిరీస్ ఆఖరి వన్డే ద్వారా.. 200 ఇన్నింగ్స్ లో 8వేల పరుగుల మైలురాయిని చేరుకోగలిగాడు.

14వ భారత క్రికెటర్…

వన్డే మ్యాచ్ ల డబుల్ సెంచరీ సాధించిన 14వ భారత క్రికెటర్ గా రికార్డుల్లో చేరాడు. అంతేకాదు…ఇన్ స్టంట్ వన్డే క్రికెట్ చరిత్రలోనే ఈ ఘనత సంపాదించిన 72వ క్రికెటర్ గా నిలిచాడు.

రెండుసార్లు ప్రపంచ చాంపియన్ భారత క్రికెట్ చరిత్రలో మాత్రమే కాదు… వన్డే క్రికెట్ చరిత్రలోనే అత్యధికంగా 463 వన్డేలతో మాస్టర్ సచిన్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.

పుష్కరకాలం క్రితం వన్డే అరంగేట్రం చేసిన రోహిత్ శర్మ..మిడిలార్డర్ ఆటగాడిగా ..2007 నుంచి 2012 వరకూ 86 మ్యాచ్ లు ఆడి అంతంత మాత్రంగానే రాణించాడు.

మొత్తం ..86 వన్డేల్లో 2 సెంచరీలతో 1978 పరుగులతో 30. 43 సగటు మాత్రమే నమోదు చేశాడు.

2013 నుంచి టాప్ గేర్….

అయితే…2013 చాంపియన్స్ ట్రోఫీ టోర్నీలో …అప్పటి భారత కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ నిర్ణయంతో….రోహిత్ శర్మ కెరియర్ గ్రాఫ్ ఒక్కసారిగా మారిపోయింది. రోహిత్ ను మిడిలార్డర్ నుంచి ఓపెనర్ గా ప్రమోట్ చేయాలన్న నిర్ణయం…టీమిండియాకు ఓ అసాధారణ ఓపెనర్ ను అందించింది.

టీమిండియా వన్డే ఓపెనర్ గా రోహిత్ గత ఆరేళ్ల కాలంలో అత్యుత్తమంగా రాణిస్తూ వస్తున్నాడు. 2013 చాంపియన్స్ ట్రోఫీ నుంచి ప్రస్తుత సిరీస్ లోని మూడో వన్డే వరకూ 113 మ్యాచ్ లు ఆడిన రోహిత్ 5వేల 821 పరుగులు సాధించాడు.

ఇందులో …3 డబుల్ సెంచరీలతో సహా 20 శతకాలున్నాయి. మొత్తం 60.00 సగటుతో తిరుగులేని ఓపెనర్ గా రోహిత్ నిలిచాడు.

ఒకే ఒక్కడు….

అంతేకాదు…వన్డే క్రికెట్ చరిత్రలోనే…మూడు ద్విశతకాలు బాదిన ఏకైక ఓపెనర్ రోహిత్ శర్మ మాత్రమే. 2016 సీజన్ నుంచి.. క్యాలెండర్ ఇయర్ కు ఓ డబుల్ సెంచరీ చొప్పున సాధిస్తూ వచ్చిన క్రికెటర్ కూడా రోహిత్ శర్మ మాత్రమే.

ఆస్ట్రేలియా తో ముగిసిన ఆఖరి వన్డే వరకూ…తన కెరియర్ లో ఆడిన 200కు పైగా మ్యాచ్ ల్లో…రోహిత్ శర్మ ..ఏకంగా 8 పరుగులు సాధించాడు. 22 సెంచరీలు, 41 హాఫ్ సెంచరీలతో పాటు… 216 సిక్సర్లతో వారేవ్వా అనిపించుకొన్నాడు.

త్వరలో ఇంగ్లండ్ అండ్ వేల్స్ వేదికగా జరిగే ప్రపంచకప్ లో సైతం..రోహిత్ శర్మ తన దూకుడుకొనసాగించి…మ్యాచ్ విన్నర్ గా నిలవాలని కోరుకొందాం.

First Published:  14 March 2019 5:54 AM GMT
Next Story