Telugu Global
Cinema & Entertainment

ఇలా పెళ్ళి అయిందో లేదో.... అప్పుడే....

కోలీవుడ్ లో ఇప్పుడు అత్యంత ముచ్చటైన జంట ఎవరంటే, అది కచ్చితం గా ఆర్య-సయేషా అని చెబుతున్నారు. కొంత కాలం ప్రేమాయణం నడిపి, వెంటనే పెళ్ళి కి రెడీ అని స్టేట్మెంట్ ఇచ్చి అందరినీ ఆశ్చర్య పరిచారు. మార్చి 10 న ఇరు కుటుంభ సభ్యుల సమక్షం లో ఈ జంట ఒక్కటయినది. ఇప్పుడు సోషల్ మీడియా లో ఎక్కడ చూసినా వీరి ఎంగేజ్మెంట్ మరియు పెళ్ళి కి సంబంధించిన ఫొటోలే కనిపిస్తున్నాయి. అయితే వీరిద్దరూ పెళ్ళి […]

ఇలా పెళ్ళి అయిందో లేదో.... అప్పుడే....
X

కోలీవుడ్ లో ఇప్పుడు అత్యంత ముచ్చటైన జంట ఎవరంటే, అది కచ్చితం గా ఆర్య-సయేషా అని చెబుతున్నారు. కొంత కాలం ప్రేమాయణం నడిపి, వెంటనే పెళ్ళి కి రెడీ అని స్టేట్మెంట్ ఇచ్చి అందరినీ ఆశ్చర్య పరిచారు.

మార్చి 10 న ఇరు కుటుంభ సభ్యుల సమక్షం లో ఈ జంట ఒక్కటయినది. ఇప్పుడు సోషల్ మీడియా లో ఎక్కడ చూసినా వీరి ఎంగేజ్మెంట్ మరియు పెళ్ళి కి సంబంధించిన ఫొటోలే కనిపిస్తున్నాయి.

అయితే వీరిద్దరూ పెళ్ళి తర్వాత హనీమూన్ కి పెద్ద గా ప్రాధాన్యత ఇస్తున్నట్టు గా అనిపించడం లేదు. ఎందుకంటే, ఇప్పటికే వీళ్ళు చేసే సినిమాలు రిలీజ్ కి దగ్గర పడడం తో, ఇద్దరూ టైం వెస్ట్ చెయ్యకుండా వాటిని ముగించే పనిలో ఉన్నారు.

అది మాత్రమే కాదు…. ఇలా పెళ్ళి అయ్యిందో లేదో ఇద్దరూ కలిసి అప్పుడే ఒక సినిమాకు కూడా సైన్ చేశారు. వీరిద్దరూ కలిసి టిక్ టిక్ టిక్ సినిమా తీసిన శక్తి సౌందర్ రాజన్ దర్శకత్వం లో ఒక సినిమా చేయనున్నారు.

పెళ్ళి అనంతరం ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఈ చిత్రానికి సంబంధించి షూట్ మే నెలలో మొదలు కానున్నది.

First Published:  16 March 2019 3:58 AM GMT
Next Story