భారత్ వేదికగా మరో ప్రపంచకప్ ఫుట్ బాల్ టోర్నీ
2020 పీఫా అండర్ -17 మహిళా ప్రపంచకప్ కు గ్రీన్ సిగ్నల్ భారత యువ మహిళా సాకర్ జట్టుకు సువర్ణావకాశం ప్రపంచ క్రికెట్, హాకీ టోర్నీలకు మాత్రమే ఇప్పటి వరకూ ఆతిథ్యమిస్తూ వచ్చిన భారత్….ప్రపంచ నంబర్ వన్ గేమ్ ఫుట్ బాల్ లో సైతం టోర్నీలు నిర్వహించడానికి ప్రాధాన్యమిస్తోంది. గతంలో పీఫా అండర్ -17 యూత్ ప్రపంచకప్ ను విజయవంతంగా నిర్వహించిన భారత ఫుట్ బాల్ సమాఖ్య..2020లో జరిగే మహిళల అండర్ -17 ప్రపంచకప్ టోర్నీని సైతం నిర్వహించడానికి […]
- 2020 పీఫా అండర్ -17 మహిళా ప్రపంచకప్ కు గ్రీన్ సిగ్నల్
- భారత యువ మహిళా సాకర్ జట్టుకు సువర్ణావకాశం
ప్రపంచ క్రికెట్, హాకీ టోర్నీలకు మాత్రమే ఇప్పటి వరకూ ఆతిథ్యమిస్తూ వచ్చిన భారత్….ప్రపంచ నంబర్ వన్ గేమ్ ఫుట్ బాల్ లో సైతం టోర్నీలు నిర్వహించడానికి ప్రాధాన్యమిస్తోంది.
గతంలో పీఫా అండర్ -17 యూత్ ప్రపంచకప్ ను విజయవంతంగా నిర్వహించిన భారత ఫుట్ బాల్ సమాఖ్య..2020లో జరిగే మహిళల అండర్ -17 ప్రపంచకప్ టోర్నీని సైతం నిర్వహించడానికి అనుమతి సంపాదించింది.
మియామీ వేదికగా ముగిసిన పిఫా సమావేశంలో అండర్ -17 మహిళా ప్రపంచకప్ ను నిర్వహించే అవకాశం భారత్ కు ఇస్తూ నిర్ణయం తీసుకొన్నారు. గత ఏడాది ఉరుగ్వే వేదికగా ముగిసిన 2017 పీఫా అండర్ -17 మహిళా ప్రపంచకప్ టోర్నీలో స్పెయిన్ విజేతగా నిలిచింది. మెక్సికోకు రెండు, న్యూజిలాండ్ మూడు, కెనడా నాలుగు స్థానాలు సాధించాయి.
ప్రపంచకప్ టోర్నీ ఏదైనా ఆతిథ్య దేశానికి మాత్రం…నేరుగా తనజట్టును బరిలోకి దించే వెసులు బాటు ఉంటుంది. ఈ అవకాశాన్ని భారత్ పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలన్న పట్టుదలతో ఉంది.
భారత మహిళల అండర్ -17 జట్టు తొలిసారిగా ప్రపంచకప్ టోర్నీలో నేరుగా పాల్గొనే అవకాశం దక్కించుకోగలుగుతుంది.