Telugu Global
NEWS

పొరిగింటి పుల్లకూర రుచి అని వెళ్ళా.... శిక్ష అనుభవించా.... " బుట్టా రేణుక

వైసీపీలోకి తిరిగి రావడం సొంత ఇంటికొచ్చినంత ఫీలింగ్‌ ఉందన్నారు కర్నూలు ఎంపీ బుట్టా రేణుక. టీడీపీలోకి ఫిరాయించిన ఆమె తిరిగి… వైసీపీలో చేరారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె… దూరం నుంచి చూస్తే అన్నీ బాగా కనిపిస్తాయని ఆ భ్రమతోనే తాను తప్పు చేశానని చెప్పారు. కానీ తనకు ఎక్కడ గౌరవం ఉంది, ఎక్కడ స్థానం ఉంది అన్నది రెండు పార్టీల్లో పోల్చుకున్న తర్వాత తనకు తెలిసిందన్నారు. వైసీపీలో ఉన్నంత క్లారిటీ టీడీపీలో లేదన్నారు. మాటలు మాత్రమే అక్కడ చెబుతుంటారని… కానీ స్పష్టత మాత్రం ఎవరికీ […]

పొరిగింటి పుల్లకూర రుచి అని వెళ్ళా.... శిక్ష అనుభవించా....  బుట్టా రేణుక
X

వైసీపీలోకి తిరిగి రావడం సొంత ఇంటికొచ్చినంత ఫీలింగ్‌ ఉందన్నారు కర్నూలు ఎంపీ బుట్టా రేణుక. టీడీపీలోకి ఫిరాయించిన ఆమె తిరిగి… వైసీపీలో చేరారు.

ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె… దూరం నుంచి చూస్తే అన్నీ బాగా కనిపిస్తాయని ఆ భ్రమతోనే తాను తప్పు చేశానని చెప్పారు. కానీ తనకు ఎక్కడ గౌరవం ఉంది, ఎక్కడ స్థానం ఉంది అన్నది రెండు పార్టీల్లో పోల్చుకున్న తర్వాత తనకు తెలిసిందన్నారు.

వైసీపీలో ఉన్నంత క్లారిటీ టీడీపీలో లేదన్నారు. మాటలు మాత్రమే అక్కడ చెబుతుంటారని… కానీ స్పష్టత మాత్రం ఎవరికీ టీడీపీలో ఇవ్వరన్నారు. మభ్యపెట్టి, మనుషులను టార్చర్ పెడుతుంటారని…. దానికి తనకు ఎదురైన అనుభవాలే నిదర్శనమన్నారు. రెండు పార్టీల్లో ఉన్న తేడా చూసి తిరిగి సొంతింటికి వచ్చానన్నారు.

ఎలాంటి షరతులు లేకుండానే తాను వైసీపీలో చేరుతున్నట్టు చెప్పారు. టీడీపీ వాళ్లు తనను మోసం చేశారన్న దాంట్లో ఎలాంటి అనుమానం లేదన్నారు. కానీ తాను చేసిన పొరపాటుకు శిక్షగా దాన్ని భావిస్తున్నట్టు చెప్పారు.

ఈ ఏడాదిలో టీడీపీలో చాలా బాధను భరించానని చెప్పారు. టీడీపీ పైకి బీసీల పార్టీ అని చెప్పుకుంటూ బీసీలకు తీవ్ర అన్యాయం చేస్తున్నారన్నారు. పొరిగింటి పుల్లగూర రుచి అన్నట్టు తాను టీడీపీలోకి వెళ్లానని… కానీ అక్కడికి వెళ్లిన తర్వాత ఆ పార్టీలో బీసీల పరిస్థితి ఏంటో తెలిసొచ్చిందన్నారు.

First Published:  16 March 2019 7:30 PM GMT
Next Story