Telugu Global
NEWS

లోకేష్‌ను ఓడించాలని పద్మశాలి సంఘం ఏకగ్రీవ తీర్మానం

రాష్ట్రంలో పద్మశాలీలను చంద్రబాబు మోసం చేశారని రాష్ట్ర పద్మశాలి సంఘం ఆరోపించింది. పద్మశాలీలు ఎక్కువగా ఉండే మంగళగిరి అసెంబ్లీ సీటును నారా లోకేష్ కబ్జా చేసేందుకు వచ్చారని… కాబట్టి నారా లోకేష్‌ను ఈ ఎన్నికల్లో ఓడించాలని సంఘం ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. విజయవాడలోని పద్మశాలి భవన్‌లో ఏర్పాటు చేసిన రాజకీయ అత్యవసర సమావేశంలో సంఘం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. టీడీపీ ఆవిర్భావం నుంచి పద్మశాలీలు ఆ పార్టీ పల్లకి మోస్తున్నారని… అలాంటి పద్మశాలీలకు ఒక్క అసెంబ్లీ సీటు కూడా కేటాయించకపోవడం మోసమేనని రాష్ట్ర అధ్యక్షుడు కేఎఎన్ […]

లోకేష్‌ను ఓడించాలని పద్మశాలి సంఘం ఏకగ్రీవ తీర్మానం
X

రాష్ట్రంలో పద్మశాలీలను చంద్రబాబు మోసం చేశారని రాష్ట్ర పద్మశాలి సంఘం ఆరోపించింది. పద్మశాలీలు ఎక్కువగా ఉండే మంగళగిరి అసెంబ్లీ సీటును నారా లోకేష్ కబ్జా చేసేందుకు వచ్చారని… కాబట్టి నారా లోకేష్‌ను ఈ ఎన్నికల్లో ఓడించాలని సంఘం ఏకగ్రీవంగా తీర్మానం చేసింది.

విజయవాడలోని పద్మశాలి భవన్‌లో ఏర్పాటు చేసిన రాజకీయ అత్యవసర సమావేశంలో సంఘం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. టీడీపీ ఆవిర్భావం నుంచి పద్మశాలీలు ఆ పార్టీ పల్లకి మోస్తున్నారని… అలాంటి పద్మశాలీలకు ఒక్క అసెంబ్లీ సీటు కూడా కేటాయించకపోవడం మోసమేనని రాష్ట్ర అధ్యక్షుడు కేఎఎన్ మూర్తి ఆరోపించారు.

ఇప్పటికే హిందూపురం, చీరాల, ధర్మవరం స్థానాలను కూడా పద్మశాలీలకు దక్కకుండా చంద్రబాబు చేశారని… ఇప్పుడు మంగళగిరి కూడా కుమారుడి కోసం కబ్జా చేస్తున్నారని మండిపడ్డారు.

కాబట్టి ఈ ఎన్నికల్లో నారా లోకేష్‌ను మంగళగిరిలో ఓడించి పద్మశాలీలు తమ సత్తా చాటాలని సమావేశంలో నేతలు నిర్ణయించారు. రాజధాని ప్రాంతంలో భూముల కోసమే లోకేష్‌ను బరిలో దింపారని సంఘం అభిప్రాయపడింది.

First Published:  17 March 2019 10:51 PM GMT
Next Story