Telugu Global
NEWS

చంద్రబాబును పిలిచే దమ్ము ఈసీకి ఉందా?

ఎన్నికల సంఘం అధికారులపై దర్శకుడు పోసాని కృష్ణమురళీ ఫైర్ అయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు వ్యతిరేకంగా తాను సినిమా తీస్తున్నానని టీడీపీ కార్యకర్త ఎవరో లేఖ రాస్తే నోటీసులు జారీ చేయడం ఏమిటని ప్రశ్నించారు. అసలు ఇప్పటి వరకు తన సినిమా గురించి ఒక్క విషయం కూడా బయటకు తెలియదన్నారు. అలాంటప్పుడు తాను చంద్రబాబు గురించే సినిమా తీస్తున్నానని ఎలా చెబుతారని ప్రశ్నించారు. టీడీపీ కార్యకర్త మోహన్ లేఖ రాస్తే ముందు అతడికి సినిమా గురించి ఎలా తెలిసింది, ఏదైనా సాక్ష్యం ఉందా? అని ప్రశ్నించాల్సిన […]

చంద్రబాబును పిలిచే దమ్ము ఈసీకి ఉందా?
X

ఎన్నికల సంఘం అధికారులపై దర్శకుడు పోసాని కృష్ణమురళీ ఫైర్ అయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు వ్యతిరేకంగా తాను సినిమా తీస్తున్నానని టీడీపీ కార్యకర్త ఎవరో లేఖ రాస్తే నోటీసులు జారీ చేయడం ఏమిటని ప్రశ్నించారు.

అసలు ఇప్పటి వరకు తన సినిమా గురించి ఒక్క విషయం కూడా బయటకు తెలియదన్నారు. అలాంటప్పుడు తాను చంద్రబాబు గురించే సినిమా తీస్తున్నానని ఎలా చెబుతారని ప్రశ్నించారు. టీడీపీ కార్యకర్త మోహన్ లేఖ రాస్తే ముందు అతడికి సినిమా గురించి ఎలా తెలిసింది, ఏదైనా సాక్ష్యం ఉందా? అని ప్రశ్నించాల్సిన ఇంగిత జ్ఞానం ఈసీకి లేదా అని ప్రశ్నించారు.

అలా చేయకుండా టీడీపీ కార్యకర్త ఫిర్యాదు చేయగానే.. అమరావతి రావాల్సిందిగా ఎలా నోటీసులు ఇస్తారని ప్రశ్నించారు. ప్రాణం పోయినా సరే తాను ఈసీ ముందు హాజరుకాబోనని పోసాని ప్రకటించారు.

ఈసీ తన ప్రాథమిక హక్కులకు భంగం కలిగిస్తోందన్నారు. తాను కూడా చంద్రబాబు ఓటర్లకు డబ్బులు పంచుతున్నారని లేఖ రాస్తానని… వెంటనే చంద్రబాబుకు నోటీసులు ఇచ్చే దమ్ము ఈ ఎన్నికల సంఘానికి ఉందా అని పోసాని ప్రశ్నించారు.

పోసాని అనేవాడు బలం లేని వాడు కాబట్టి నోటీసులు ఇస్తారా? అని నిలదీశారు. విచారణకు తాను హాజరుకాబోనని.. ఒకవేళ బలవంతం చేస్తే ఈసీ ముందే ఆత్మహత్య చేసుకుంటానని పోసాని ప్రకటించారు.

First Published:  18 March 2019 9:13 AM GMT
Next Story