Telugu Global
Cinema & Entertainment

సినిమా చేస్తే పెద్ద హీరోలతోనే చేస్తాడట!

విజయ్ దేవరకొండ, రష్మిక హీరోహీరోయిన్లుగా నటించిన ‘గీతగోవిందం’ సినిమా తో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు దర్శకుడు పరశురామ్. ఈ సినిమా తరువాత మళ్లీ పరశురాం గీతా ఆర్ట్స్ బ్యానర్ లోనే సినిమా చేయాల్సి ఉంది. ఒకవైపు ఎంతకాలమైనా ఎదురు చూస్తాను కానీ సినిమా చేస్తే స్టార్ హీరోతో నే చేయాలన్న ఆలోచనతో ఉన్నాడట పరాశురాం. మరోవైపు స్టార్ హీరోలందరూ వేరే సినిమాలతో బిజీగా ఉన్నారు. అల్లు అర్జున్ ని అడిగితే వచ్చే ఏడాది చూద్దామని చెప్పాడట. దీంతో […]

సినిమా చేస్తే పెద్ద హీరోలతోనే చేస్తాడట!
X

విజయ్ దేవరకొండ, రష్మిక హీరోహీరోయిన్లుగా నటించిన ‘గీతగోవిందం’ సినిమా తో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు దర్శకుడు పరశురామ్. ఈ సినిమా తరువాత మళ్లీ పరశురాం గీతా ఆర్ట్స్ బ్యానర్ లోనే సినిమా చేయాల్సి ఉంది. ఒకవైపు ఎంతకాలమైనా ఎదురు చూస్తాను కానీ సినిమా చేస్తే స్టార్ హీరోతో నే చేయాలన్న ఆలోచనతో ఉన్నాడట పరాశురాం.

మరోవైపు స్టార్ హీరోలందరూ వేరే సినిమాలతో బిజీగా ఉన్నారు. అల్లు అర్జున్ ని అడిగితే వచ్చే ఏడాది చూద్దామని చెప్పాడట. దీంతో అల్లు అరవింద్ నాగచైతన్య, మరో ఇద్దరు మీడియం రేంజ్ హీరోలతో చర్చలు జరిపారట. కానీ పరశురామ్ మాత్రం వద్దని చెప్పాడట. పెద్ద హీరోల డేట్ లంటే చాలా కాలం పడుతుందని అల్లు అరవింద్ హెచ్చరించినప్పటికీ మరేం పర్వాలేదు అని అంటున్నాడట. దీనికి కారణం పరశురామ్ ‘గీతగోవిందం’ సినిమాతో అందిన భారీ పారితోషికంతో కొత్త ఇల్లు కట్టించుకుంటున్నాడట. ఆ ఇంటి పనులతో బిజీగా ఉన్నాడు పరశురామ్.

కాబట్టి లేట్ అయినా పర్వాలేదు… ఈలోపు కొత్త ఇల్లు కట్టించే పనులు చూసుకుందామని నిర్ణయించుకున్నాడట. మరి ఇంటి పని పూర్తయ్యాక పరశురామ్ ఏ స్టార్ హీరో ని లైన్ లో పెడతాడో వేచి చూడాలి.

First Published:  19 March 2019 1:30 AM GMT
Next Story