Telugu Global
Cinema & Entertainment

'విన్నర్' కాంబో రిపీట్ అవ్వనుందా?

వరుసగా 6 డిజాస్టర్ లను అందుకున్న మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం తన ఆశలన్నీ తన తదుపరి సినిమా అయిన ‘చిత్రాలహరి’ పైనే పెట్టుకున్నాడు. కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రంలో నివేథ పేతురాజ్, కల్యాణీ ప్రియదర్శన్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రం ఏప్రిల్ లో విడుదల కానుంది. ఇప్పటికే ఈ చిత్ర టీజర్ పై ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంటోంది. ఈ సినిమా ఇంకా విడుదల కాలేదు కానీ […]

విన్నర్ కాంబో రిపీట్ అవ్వనుందా?
X

వరుసగా 6 డిజాస్టర్ లను అందుకున్న మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం తన ఆశలన్నీ తన తదుపరి సినిమా అయిన ‘చిత్రాలహరి’ పైనే పెట్టుకున్నాడు. కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రంలో నివేథ పేతురాజ్, కల్యాణీ ప్రియదర్శన్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రం ఏప్రిల్ లో విడుదల కానుంది.

ఇప్పటికే ఈ చిత్ర టీజర్ పై ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంటోంది. ఈ సినిమా ఇంకా విడుదల కాలేదు కానీ సాయి ధరమ్ తేజ్ మాత్రం మరొక సినిమా ను లైన్ లో పెట్టాడు. తాజాగా సాయి ధరమ్ తేజ్ ‘భలే భలే మగాడివోయ్’ దర్శకుడితో చేయి కలపడానికి సిద్ధమయ్యాడు.

తాజా సమాచారం ప్రకారం సాయి ధరంతేజ్ మారుతి దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నాడట. ‘మహానుభావుడు’ సినిమాతో హిట్ అందుకున్న మారుతి…. ‘శైలజా రెడ్డి అల్లుడు’ సినిమాతో ప్రేక్షకులను మెప్పించలేక పోయిన సంగతి తెలిసిందే.

తాజాగా ఇప్పుడు సాయిధరమ్ తేజ్ హీరోగా రాబోతున్న సినిమాకు మారుతి దర్శకత్వం వహిస్తున్నారు. స్టార్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించబోతోందంటున్నారు.

ఇప్పటికే సాయి ధరమ్ తేజ్ సరసన రకుల్ ప్రీత్ ‘విన్నర్’ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు ఈ సినిమాను నిర్మించబోతున్నాడు. ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు త్వరలో వెలువడనున్నాయి.

First Published:  20 March 2019 4:16 AM GMT
Next Story