Telugu Global
NEWS

పరిటాల ఫ్యామిలీకి ఓటమి భయం....

ఇప్పటికీ ఫ్యాక్షన్ మూలాలు కనిపిస్తున్న ప్రాంతాలలో అనంతపురం జిల్లాలోని రాప్తాడు నియోజకవర్గం ఒకటి. ఐదేళ్లలో పలువురు వైసీపీనేతలు ఇక్కడ హత్యలకు గురయ్యారు. ఈసారి పరిటాల శ్రీరాంను టీడీపీ బరిలోకి దింపింది. అయితే ఎన్నికల ప్రచారంలో టీడీపీ నేతలు వ్యవహరిస్తున్న తీరు చర్చనీయాంశమవుతోంది. పరిటాల శ్రీరాం ఓడిపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని టీడీపీ నేతలు ఓటర్లను హెచ్చరిస్తుండడం చర్చకు దారి తీస్తోంది. ఓడిపోతాం అన్న భావన టీడీపీ నేతలకు ఎందుకు వచ్చిందని చర్చించుకుంటున్నారు. తాజాగా కనగానపల్లి టీడీపీ నేత ముకుందనాయుడు… బహిరంగంగానే ఓటర్లకు వార్నింగ్ ఇచ్చారు. పరిటాల సునీతతో […]

పరిటాల ఫ్యామిలీకి ఓటమి భయం....
X

ఇప్పటికీ ఫ్యాక్షన్ మూలాలు కనిపిస్తున్న ప్రాంతాలలో అనంతపురం జిల్లాలోని రాప్తాడు నియోజకవర్గం ఒకటి. ఐదేళ్లలో పలువురు వైసీపీనేతలు ఇక్కడ హత్యలకు గురయ్యారు. ఈసారి పరిటాల శ్రీరాంను టీడీపీ బరిలోకి దింపింది.

అయితే ఎన్నికల ప్రచారంలో టీడీపీ నేతలు వ్యవహరిస్తున్న తీరు చర్చనీయాంశమవుతోంది. పరిటాల శ్రీరాం ఓడిపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని టీడీపీ నేతలు ఓటర్లను హెచ్చరిస్తుండడం చర్చకు దారి తీస్తోంది. ఓడిపోతాం అన్న భావన టీడీపీ నేతలకు ఎందుకు వచ్చిందని చర్చించుకుంటున్నారు.

తాజాగా కనగానపల్లి టీడీపీ నేత ముకుందనాయుడు… బహిరంగంగానే ఓటర్లకు వార్నింగ్ ఇచ్చారు. పరిటాల సునీతతో కలిసి తల్లిమడుగు గ్రామంలో ప్రచారం నిర్వహించిన ముకుందనాయుడు… పోలింగ్ తేదీలోగా అందరూ టీడీపీలో చేరిపోవాలని అల్టిమేటం జారీ చేశారు. లేకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.

ఎన్నికల్లో టీడీపీకి ఓటేయకపోతే చంపుతామని హెచ్చరించారు. ఈసారి నేరుగా పరిటాల శ్రీరామే పోటీ చేస్తున్నారని… ఆయన ఓడిపోతే సహించే ప్రసక్తే ఉండదన్నారు. టీడీపీ నేత ముకుందనాయుడు వ్యాఖ్యల వీడియో సోషల్ మీడియాలో తిరుగుతోంది.

First Published:  20 March 2019 9:10 PM GMT
Next Story