Telugu Global
NEWS

అజ్ఞాతంలోకి మరో టీడీపీ అభ్యర్థి

టికెట్లు దక్కినా సరే పోటీకి వెనుకాడుతున్నారు టీడీపీ నేతలు. మరో అభ్యర్థి కూడా ఇప్పుడు అజ్ఞాతంలోకి వెళ్లిపోవడం టీడీపీని కలవరపాటుకు గురి చేస్తోంది. చిత్తూరు జిల్లా పూతలపట్టు టీడీపీ అభ్యర్థి తెర్లాం పూర్ణం అందుబాటులో లేకుండా పోయారు. ప్రచారం ఉధృతం చేయాల్సిన ఈసమయంలో పూర్ణం కనిపించకుండా పోవడంతో టీడీపీ శ్రేణులు షాక్ తిన్నాయి. జిల్లా కార్యాలయంలో బీపాం ఇచ్చేందుకు ఆయన్ను ఆహ్వానించాలని టీడీపీ నేతలు ప్రయత్నించినా అందుబాటులో లేరు. తొలుత గుండెపోటుతో ఆస్పత్రిలో ఉన్నారని ప్రచారం సాగింది. ఆ తర్వాత ఆయన ఢిల్లీకి వెళ్లిపోయారని చెబుతున్నారు. బంధువుల ద్వారా […]

అజ్ఞాతంలోకి మరో టీడీపీ అభ్యర్థి
X

టికెట్లు దక్కినా సరే పోటీకి వెనుకాడుతున్నారు టీడీపీ నేతలు. మరో అభ్యర్థి కూడా ఇప్పుడు అజ్ఞాతంలోకి వెళ్లిపోవడం టీడీపీని కలవరపాటుకు గురి చేస్తోంది.

చిత్తూరు జిల్లా పూతలపట్టు టీడీపీ అభ్యర్థి తెర్లాం పూర్ణం అందుబాటులో లేకుండా పోయారు. ప్రచారం ఉధృతం చేయాల్సిన ఈసమయంలో పూర్ణం కనిపించకుండా పోవడంతో టీడీపీ శ్రేణులు షాక్ తిన్నాయి.

జిల్లా కార్యాలయంలో బీపాం ఇచ్చేందుకు ఆయన్ను ఆహ్వానించాలని టీడీపీ నేతలు ప్రయత్నించినా అందుబాటులో లేరు. తొలుత గుండెపోటుతో ఆస్పత్రిలో ఉన్నారని ప్రచారం సాగింది.

ఆ తర్వాత ఆయన ఢిల్లీకి వెళ్లిపోయారని చెబుతున్నారు. బంధువుల ద్వారా పూర్ణంను సంప్రదించేందుకు టీడీపీ నేతలు ప్రయత్నించారు. కానీ అది కూడా వీలు కాలేదు. దాంతో పూతలపట్టులో టీడీపీ శ్రేణులు గందరగోళంలో పడ్డాయి.

First Published:  20 March 2019 10:44 PM GMT
Next Story