Telugu Global
CRIME

పబ్‌జీ గేమ్ ఆడుతూ... మెడ న‌రాలు ప‌ట్టేసి యువకుడు మృతి

ప‌బ్‌జీ గేమ్ ప్రాణాలు తీస్తోంది. యువ‌త‌కు ఈ గేమ్ వ్య‌స‌నంలా మారింది. ఈ గేమ్ మాయ‌లో ప‌డి జ‌గిత్యాల జిల్లాకు చెందిన ఓ యువ‌కుడు ప్రాణాలు కోల్పాయాడు. వెల్గటూరు మండలం రాజారంపల్లికి చెందిన సాగర్‌ అనే 20 ఏళ్ల యువకుడు పబ్‌జీ గేమ్ ప‌ద్మ‌వ్యూహాంలో చిక్కుకున్నాడు. టైమ్ పాస్‌గా మొద‌లైన ఈ ఆట ఆ త‌ర్వాత పిచ్చిగా మారింది. 45 రోజులుగా పదేపదే ఈ గేమ్ ఆడాడు. 24 గంట‌ల్లో దాదాపు 16 నుంచి 18 గంట‌లు […]

పబ్‌జీ గేమ్ ఆడుతూ... మెడ న‌రాలు ప‌ట్టేసి యువకుడు మృతి
X

ప‌బ్‌జీ గేమ్ ప్రాణాలు తీస్తోంది. యువ‌త‌కు ఈ గేమ్ వ్య‌స‌నంలా మారింది. ఈ గేమ్ మాయ‌లో ప‌డి జ‌గిత్యాల జిల్లాకు చెందిన ఓ యువ‌కుడు ప్రాణాలు కోల్పాయాడు. వెల్గటూరు మండలం రాజారంపల్లికి చెందిన సాగర్‌ అనే 20 ఏళ్ల యువకుడు పబ్‌జీ గేమ్ ప‌ద్మ‌వ్యూహాంలో చిక్కుకున్నాడు. టైమ్ పాస్‌గా మొద‌లైన ఈ ఆట ఆ త‌ర్వాత పిచ్చిగా మారింది.

45 రోజులుగా పదేపదే ఈ గేమ్ ఆడాడు. 24 గంట‌ల్లో దాదాపు 16 నుంచి 18 గంట‌లు ఈ గేమ్‌కు అతుక్కుపోయాడు. దీంతో అతని మెడ నరాలు పట్టేసి ఆరోగ్యం విషమించింది. కుటుంబసభ్యులు హైదరాబాద్‌లోని ఓ ప్రయివేట్‌ ఆసుపత్రిలో చేర్పించారు. గత 5 రోజులుగా వైద్యులు సాగర్‌కు చికిత్స అందించగా.. నరాలు పూర్తిగా దెబ్బతినడంతో తుదిశ్వాస విడిచాడు.

ఇక పబ్‌జీ గేమ్‌తో ప్రాణాల మీదకు తెచ్చుకున్న సాగర్‌ను చూపిస్తూ.. అతని స్నేహితులు ఓ అవేర్‌నెస్ వీడియోను కూడా రూపొందించారు. పబ్‌జీ గేమ్‌ ఆడటం ఎంత ప్రమాదకరమో సాగర్‌ పరిస్థితి చూసి తెలుసుకోండని ఆ వీడియో ద్వారా విజ్ఞప్తి చేశారు. అయితే ఈ పబ్‌జీ మహమ్మారికి యువత బానిసలుగా అవుతోంది. ఈ గేమ్‌ వల్ల ఇప్పటికే ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. నిద్రహారాలు మాని అనారోగ్యానికి గురవ్వడమే కాకుండా.. చదువు, చేసే పనిపై శ్రద్ద చూపించలేకపోతున్నారు.

ఓ స్టూడెంట్ పరీక్షలో ఎకనామిక్స్ సూత్రాలకు బదులు పబ్ జీ వ్యాసం రాశాడు. తాను గేమ్‌ ఆడటం మానేసినా.. దానికి సంబంధించిన చిత్రాలు తనను వదలడం లేదని, పబ్‌జీ ఎంత ప్రమాదమో ఇప్పుడు అర్థమైందని తెలిపాడు. యువకులకు వ్యసనంగా మారిన ఈ గేమ్‌ను నిషేంధించాలనే డిమాండ్‌ అన్ని వర్గాల నుంచి వ్యక్తమవుతోంది..

First Published:  22 March 2019 12:00 AM GMT
Next Story