Telugu Global
Cinema & Entertainment

'గ్లాస్‌మేట్స్' సాంగ్ లాంఛ్ చేయనున్న మెగా మేనల్లుడు

వరుసగా ఆరు డిజాస్టర్లను అందుకున్న మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ఇప్పుడు తన ఆశలన్నీ తన తదుపరి చిత్రం ‘చిత్రలహరి’ పైనే పెట్టుకున్న సంగతి తెలిసిందే. కిషోర్ తిరుమల దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఏప్రిల్ 12న విడుదల కానుంది. నివేదా పేతురాజ్, కళ్యాణి ప్రియదర్శన్ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటించారు. ఈ మధ్యనే విడుదలైన ఈ చిత్ర టీజర్2కు ప్రేక్షకుల నుంచి చాలా మంచి రెస్పాన్స్ అందింది. టీజర్ చాలా ఆకట్టుకునే విధంగా ఉందని […]

గ్లాస్‌మేట్స్ సాంగ్ లాంఛ్ చేయనున్న మెగా మేనల్లుడు
X

వరుసగా ఆరు డిజాస్టర్లను అందుకున్న మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ఇప్పుడు తన ఆశలన్నీ తన తదుపరి చిత్రం ‘చిత్రలహరి’ పైనే పెట్టుకున్న సంగతి తెలిసిందే. కిషోర్ తిరుమల దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఏప్రిల్ 12న విడుదల కానుంది. నివేదా పేతురాజ్, కళ్యాణి ప్రియదర్శన్ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటించారు.

ఈ మధ్యనే విడుదలైన ఈ చిత్ర టీజర్2కు ప్రేక్షకుల నుంచి చాలా మంచి రెస్పాన్స్ అందింది. టీజర్ చాలా ఆకట్టుకునే విధంగా ఉందని సినిమా కూడా కచ్చితంగా హిట్ అవుతుందని మెగా అభిమానులు కూడా ఆశపడుతున్నారు. అంతేకాక ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ‘పరుగు పరుగు’ అనే పాటకు మంచి ఆదరణ లభించింది.

ఈ నేపథ్యంలో సినిమాలోని రెండవ పాటను విడుదల చేయడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది. తాజా సమాచారం ప్రకారం చిత్రలహరిలోని ‘గ్లాస్‌మేట్స్’ అనే పాటను త్వరలో లాంచ్ చేయనున్నారని తెలుస్తోంది. ఖమ్మంలోని సీక్వెల్ రిసార్ట్స్‌లో మార్చి 24వ తారీఖున సాయంత్రం ఏడు గంటలకు ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్ జరుగనుంది.

టీజర్ చాలా బాగుండటంతో సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. మైత్రి మూవీ మేకర్స్ ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు.

First Published:  22 March 2019 12:32 AM GMT
Next Story