Telugu Global
NEWS

మాపై దాడులా?... ఎప్పుడు పవన్ " సెటిలర్ల మండిపాటు

తెలంగాణలో ఉన్న ఆంధ్రా సెటిలర్లు జనసేన పార్టీ అధ్యక్షుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై ఆగ్రహంగా ఉన్నారు. తెలంగాణ రాజధాని హైదరాబాద్ తో సహా తెలంగాణ జిల్లాలో ఉద్యోగాలు, వ్యాపారాలు, వివిధ వృత్తుల్లో ఉన్న సెటిలర్లు పవన్ చేస్తున్న వ్యాఖ్యలపై మండిపడుతున్నారు. తెలంగాణలో సెటిలైన ఆంధ్రుల పై దాడులు జరుగుతున్నాయంటూ పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సభలో వ్యాఖ్యానించడాన్ని తీవ్రంగా తప్పు పడుతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి నేటి వరకు ఏ ఒక్క సెటిలర్ […]

మాపై దాడులా?... ఎప్పుడు పవన్  సెటిలర్ల మండిపాటు
X

తెలంగాణలో ఉన్న ఆంధ్రా సెటిలర్లు జనసేన పార్టీ అధ్యక్షుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై ఆగ్రహంగా ఉన్నారు. తెలంగాణ రాజధాని హైదరాబాద్ తో సహా తెలంగాణ జిల్లాలో ఉద్యోగాలు, వ్యాపారాలు, వివిధ వృత్తుల్లో ఉన్న సెటిలర్లు పవన్ చేస్తున్న వ్యాఖ్యలపై మండిపడుతున్నారు.

తెలంగాణలో సెటిలైన ఆంధ్రుల పై దాడులు జరుగుతున్నాయంటూ పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సభలో వ్యాఖ్యానించడాన్ని తీవ్రంగా తప్పు పడుతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి నేటి వరకు ఏ ఒక్క సెటిలర్ పైన ఎలాంటి దాడులు జరగలేదని గుర్తు చేస్తున్నారు.

గతంలో పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ను కలిసి “మీ ఏలికలో ఆంధ్రులు క్షేమంగా ఉన్నారు” అంటూ ప్రశంసించడాన్ని పవన్ కళ్యాణ్ మరిచిపోయారా? అని ఇప్పుడు గుర్తు చేస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వ్యవహరించడం కోసం తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పై విమర్శలు చేయడం తగదని హితవు పలుకుతున్నారు.

ఇప్పటికే పవన్ కళ్యాణ్ పై సినీ రంగానికి చెందిన వారు మండి పడుతున్నారని, ఇప్పుడు తెలంగాణలో ఉన్న సెటిలర్లు కూడా పవన్ కళ్యాణ్ ను అసహ్యించుకునే స్థితికి రాకుండా ఉండాలంటే ఆయన చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు.

“మీ రహస్య రాజకీయ మిత్రుడు చంద్రబాబు కోసం తెలంగాణలో ఎన్నాళ్ల నుంచో ఉన్న సెటిలర్లను పావులా వాడుకోవాలనుకుంటే చూస్తూ ఊరుకునేది లేదు” అని సెటిలర్లు హెచ్చరిస్తున్నారు.

First Published:  24 March 2019 6:23 AM GMT
Next Story