మరో జంప్కు సిద్ధమైన ఎస్పీవై రెడ్డి ?
ఎస్పీ వై రెడ్డి కుటుంబం జనసేనకు హ్యాండ్ ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. తనతో పాటు తన అల్లుడిని కూడా ఎన్నికల బరిలో నిలపాలని ఎస్పీవై రెడ్డి భావించారు. కానీ చంద్రబాబు టికెట్లు ఇవ్వలేదు. దీంతో జనసేనలో చేరి ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులుగా ఎస్పీవై రెడ్డి కుటుంబసభ్యులు బరిలోకి దిగారు. ఇప్పుడు టీడీపీ నుంచి మరో ప్రతిపాదన రావడంలో ఎస్పీవై రెడ్డి పునరాలోచనలో పడ్డారు. అమరావతి నుంచి పిలుపు రావడంతో శనివారం ఎస్పీవై రెడ్డి కుమార్తె సుజల… అమరావతికి వెళ్లి టీడీపీ పెద్దలతో చర్చలు జరిపారు. […]
ఎస్పీ వై రెడ్డి కుటుంబం జనసేనకు హ్యాండ్ ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. తనతో పాటు తన అల్లుడిని కూడా ఎన్నికల బరిలో నిలపాలని ఎస్పీవై రెడ్డి భావించారు. కానీ చంద్రబాబు టికెట్లు ఇవ్వలేదు. దీంతో జనసేనలో చేరి ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులుగా ఎస్పీవై రెడ్డి కుటుంబసభ్యులు బరిలోకి దిగారు.
ఇప్పుడు టీడీపీ నుంచి మరో ప్రతిపాదన రావడంలో ఎస్పీవై రెడ్డి పునరాలోచనలో పడ్డారు. అమరావతి నుంచి పిలుపు రావడంతో శనివారం ఎస్పీవై రెడ్డి కుమార్తె సుజల… అమరావతికి వెళ్లి టీడీపీ పెద్దలతో చర్చలు జరిపారు. సుజలకు
ఎమ్మెల్సీ ఇస్తామని తిరిగి టీడీపీలోకి రావాల్సిందిగా పెద్దలు సూచించారు.
అమరావతి నుంచి తమకు పిలుపు వచ్చిందని… తన కుమార్తె వెళ్లి చర్చలు జరిపారని.. ఎమ్మెల్సీ ఇస్తామని టీడీపీ ఆఫర్ చేసిన మాట నిజమేనని ఎస్పీవై రెడ్డి అంగీకరించారని వెల్లడించింది. టీడీపీ ప్రతిపాదన నేపథ్యంలో పునరాలోచన చేస్తున్నట్టు కూడా ఆయన వివరించారు.
రెండు మూడు రోజుల్లో ఈ అంశంపై ఎస్పీవై రెడ్డి కుటుంబం స్పష్టమైన ప్రకటన చేసే అవకాశం ఉంది. జనసేన తరపున పోటీ చేసినా గెలిచే పరిస్థితులు ఎలాగో లేవు కాబట్టి… టీడీపీలోకే వెళ్లి ఎన్నికల తర్వాత ఎమ్మెల్సీ తీసుకుంటే బాగుంటుందన్న భావన వారిలో ఉంది.