Telugu Global
Cinema & Entertainment

వాళ్ళకు మైండ్ బ్లాక్ అయ్యే షాక్ ఇచ్చిన నమ్రత!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు పిల్లలు గౌతమ్, సితార పాపులర్ స్టార్ కిడ్స్ లో ఒకరు. ఎప్పటికప్పుడు మహేష్ బాబు, నమ్రత వీరి ఫొటోలను, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూనే ఉంటారు. అన్ని ఫొటోలు, వీడియోలు ఇప్పటిదాకా ఇంటర్ నెట్ లో వైరల్ గా మారాయి. ఈ నేపథ్యంలో ఒక యాడ్ ఏజెన్సీ వారు తమ యాడ్ లో సితార ను నటింప చెయ్యమని అడగడానికి మహేష్ భార్య నమ్రత ను సంప్రదించారు. కానీ […]

వాళ్ళకు మైండ్ బ్లాక్ అయ్యే షాక్ ఇచ్చిన నమ్రత!
X

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు పిల్లలు గౌతమ్, సితార పాపులర్ స్టార్ కిడ్స్ లో ఒకరు. ఎప్పటికప్పుడు మహేష్ బాబు, నమ్రత వీరి ఫొటోలను, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూనే ఉంటారు. అన్ని ఫొటోలు, వీడియోలు ఇప్పటిదాకా ఇంటర్ నెట్ లో వైరల్ గా మారాయి.

ఈ నేపథ్యంలో ఒక యాడ్ ఏజెన్సీ వారు తమ యాడ్ లో సితార ను నటింప చెయ్యమని అడగడానికి మహేష్ భార్య నమ్రత ను సంప్రదించారు. కానీ ఆమె వారికి అదిరిపోయే షాక్ ఇచ్చిందని ఫిలింనగర్ వర్గాలు అంటున్నాయి.

కేవలం 30 సెకండ్ల యాడ్ లో నటించడం కోసం నమ్రత చాలా పెద్ద మొత్తాన్ని డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. ఆమె చెప్పిన నంబర్ వినగానే నోరెళ్లబెట్టిన యాడ్ నిర్మాతలు అక్కడి నుండి వెంటనే వెళ్లిపోయారట.

కొందరేమో ఇంత చిన్న వయసులోనే సితార ను తెర మీదకి తీసుకురావడం తనకు ఇష్టం లేదని అందుకే అలా తనను సంప్రదించిన యాడ్ మేకర్స్ మరియు కాస్టింగ్ ఏజెంట్ ను భయపెట్టి పంపించేసిందని చెబుతున్నారు.

మరోవైపు మహేష్ బాబు ఒకవైపు సినిమాలతో, మరొకవైపు బ్రాండ్ అండార్స్ మెంట్స్ తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. మహేష్ కెరీర్ లో 25 వ చిత్రం ‘మహర్షి’ మే 9న విడుదల కానుంది.

First Published:  23 March 2019 11:44 PM GMT
Next Story