Telugu Global
NEWS

మంగళగిరి టీడీపీ నేతల్లో ఆందోళన

తండ్రి ముఖ్యమంత్రి కావడంతో నేరుగా మంత్రి అయిపోయిన నారా లోకేష్… తన అజ్ఞానంతో టీడీపీ నేతలకు చుక్కలు చూపిస్తున్నారు. మంగళగిరి వీధుల్లో ప్రచారం చేస్తున్న లోకేష్.. రోజుకో డైలాగ్‌తో షాక్‌కు గురి చేస్తున్నారు. గల్లా జయదేవ్‌ ట్రైనింగ్‌ ఇస్తున్నా లోకేష్ మాత్రం దారికి రావడం లేదు. తాజాగా ఆంధ్రా అభివృద్దిని కేసీఆర్‌ అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. అంతటితో ఆగకుండా మచిలీపట్నం పోర్టును తెలంగాణకు తరలించుకుపోయేందుకు కేసీఆర్‌ కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. దాంతో జనం ఒక్కసారిగా అవాక్కు అయి…. నవ్వారు. లోకేష్ అజ్ఞాని అని అనుకున్నామే […]

మంగళగిరి టీడీపీ నేతల్లో ఆందోళన
X

తండ్రి ముఖ్యమంత్రి కావడంతో నేరుగా మంత్రి అయిపోయిన నారా లోకేష్… తన అజ్ఞానంతో టీడీపీ నేతలకు చుక్కలు చూపిస్తున్నారు. మంగళగిరి వీధుల్లో ప్రచారం చేస్తున్న లోకేష్.. రోజుకో డైలాగ్‌తో షాక్‌కు గురి చేస్తున్నారు. గల్లా జయదేవ్‌ ట్రైనింగ్‌ ఇస్తున్నా లోకేష్ మాత్రం దారికి రావడం లేదు.

తాజాగా ఆంధ్రా అభివృద్దిని కేసీఆర్‌ అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. అంతటితో ఆగకుండా మచిలీపట్నం పోర్టును తెలంగాణకు తరలించుకుపోయేందుకు కేసీఆర్‌ కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. దాంతో జనం ఒక్కసారిగా అవాక్కు అయి…. నవ్వారు.

లోకేష్ అజ్ఞాని అని అనుకున్నామే గానీ… సముద్రం లేని తెలంగాణలో పోర్టుల నిర్మాణం సాధ్యం కాదన్న విషయం తెలియనంత అజ్ఞానా? అని కంగుతున్నారు.

లోకేష్ తీరుతో టీడీపీ నేతలే ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి అజ్ఞానిని ఎమ్మెల్యేగా చెప్పుకునేందుకు కూడా జనం సిగ్గుపడే పరిస్థితి వస్తుందని వాపోతున్నారు. దీనికి పార్టీ నాయకత్వమే ఏదైనా విరుగుడు కనిపెట్టాలని కోరుతున్నారు.

First Published:  24 March 2019 9:21 PM GMT
Next Story