Telugu Global
NEWS

స్పీడ్ పెంచిన వైసీపీ

ఏపీలో ఎన్నికల పోలింగ్ తేదీ దగ్గర పడుతుండటంతో ప్రతిపక్ష వైసీపీ స్పీడ్ పెంచింది. ఇప్పటికే అధినేత జగన్ రోజూ పలు సభల్లో పాల్గొంటు పార్టీ తరపున విస్తృత ప్రచారం చేస్తున్నారు. ఇక ఇప్పుడు పార్టీ తరపున స్టార్ క్యాంపెయినర్లుగా సోదరి, తల్లిని కూడా ప్రచారంలోనికి దింపబోతున్నారు. వైసీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, సోదరి షర్మిల ఈ నెల 29 నుంచి ప్రజల్లోకి వెళ్లనున్నారు. ముందుగా ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్‌లో రాజశేఖర రెడ్డికి నివాళులు అర్పించి తమ ప్రచారాన్ని […]

స్పీడ్ పెంచిన వైసీపీ
X

ఏపీలో ఎన్నికల పోలింగ్ తేదీ దగ్గర పడుతుండటంతో ప్రతిపక్ష వైసీపీ స్పీడ్ పెంచింది. ఇప్పటికే అధినేత జగన్ రోజూ పలు సభల్లో పాల్గొంటు పార్టీ తరపున విస్తృత ప్రచారం చేస్తున్నారు. ఇక ఇప్పుడు పార్టీ తరపున స్టార్ క్యాంపెయినర్లుగా సోదరి, తల్లిని కూడా ప్రచారంలోనికి దింపబోతున్నారు.

వైసీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, సోదరి షర్మిల ఈ నెల 29 నుంచి ప్రజల్లోకి వెళ్లనున్నారు. ముందుగా ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్‌లో రాజశేఖర రెడ్డికి నివాళులు అర్పించి తమ ప్రచారాన్ని ప్రారంభించనున్నట్లు పార్టీ అధికారిక ప్రకటనలో తెలిపారు.

ముందుగా 29న ప్రకాశం జిల్లా కందుకూరు నియోజక వర్గంలో విజయమ్మ ప్రచారం ప్రారంభిస్తారు. కనిగిరి, మార్కాపురం నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తారు. 30న ఎర్రగొండ్లపాలెం.. గుంటూరు జిల్లా మాచర్ల నియోజక వర్గాల్లో ప్రచారం చేస్తారు.

ఆ తర్వాత రోజు శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం, పలాస, పాతపట్నం, నియోజకవర్గాల్లో విజయమ్మ ప్రచారం చేస్తారు.

ఇక, షర్మిల గుంటూరు జిల్లా మంగళగిరిలో 29న, గుంటూరు ఈస్ట్, వెస్ట్‌లలో 30న, తాడికొండ, పెదకూరపాడు, నర్సారావు పేటల్లో 31న ప్రచారం చేయనున్నారు.

First Published:  27 March 2019 10:42 PM GMT
Next Story