Telugu Global
NEWS

జగన్‌కు మైనార్టీలు అండగా నిలబడండి

మోదీకి జగన్‌కు మధ్య అవగాహన ఉందని టీడీపీ విష ప్రచారం చేస్తోందన్నారు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ. ఐదేళ్లలో ముస్లింలకు చంద్రబాబు తీరని అన్యాయం చేశారన్నారు. మైనార్టీలకు చంద్రబాబు చేసినంత ద్రోహం మరెవరూ చేయలేదన్నారు. చంద్రబాబుకు ఓటేస్తే బీజేపీకి వేసినట్టేనని అసద్‌ వ్యాఖ్యానించారు. ఎన్నికల తర్వాత బీజేపీ పంచన చేరే వారిలో చంద్రబాబే ముందుంటారన్నారు. బీజేపీతో రెండు సార్లు పొత్తుపెట్టుకుని ప్రజలను వంచించిన వ్యక్తి చంద్రబాబు అని గుర్తు చేశారు. ఏపీలో మైనార్టీలంతా జగన్‌మోహన్‌ రెడ్డికి అండగా […]

జగన్‌కు మైనార్టీలు అండగా నిలబడండి
X

మోదీకి జగన్‌కు మధ్య అవగాహన ఉందని టీడీపీ విష ప్రచారం చేస్తోందన్నారు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ. ఐదేళ్లలో ముస్లింలకు చంద్రబాబు తీరని అన్యాయం చేశారన్నారు. మైనార్టీలకు చంద్రబాబు చేసినంత ద్రోహం మరెవరూ చేయలేదన్నారు.

చంద్రబాబుకు ఓటేస్తే బీజేపీకి వేసినట్టేనని అసద్‌ వ్యాఖ్యానించారు. ఎన్నికల తర్వాత బీజేపీ పంచన చేరే వారిలో చంద్రబాబే ముందుంటారన్నారు. బీజేపీతో రెండు సార్లు పొత్తుపెట్టుకుని ప్రజలను వంచించిన వ్యక్తి చంద్రబాబు అని గుర్తు చేశారు.

ఏపీలో మైనార్టీలంతా జగన్‌మోహన్‌ రెడ్డికి అండగా నిలబడి గెలిపించాలని ఓవైసీ సూచించారు. వైసీపీ మేనిఫెస్టో అద్బుతంగా ఉందన్నారు. జగన్‌ వల్ల ఒక్క ముస్లింలకే కాకుండా అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని తాను
విశ్వసిస్తున్నానని ఓవైసీ చెప్పారు.

మూడువేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రజల కష్టాలను స్వయంగా తెలుసుకున్న జగన్‌కు ఒక అవకాశం ఇవ్వాలని కోరారు. జగన్‌ గెలుపు ఆంధ్రప్రదేశ్‌కు చారిత్రక అవసరం అని అభిప్రాయపడ్డారు.

ఏపీలో జగన్‌ 130కిపైగా అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధిస్తారని అసద్‌ ధీమా వ్యక్తం చేశారు. ఏపీ రాజకీయాల్లో వైఎస్‌ఆర్‌ ఒక లెజెండ్‌ అని ప్రశంసించారు

First Published:  7 April 2019 12:00 AM GMT
Next Story