Telugu Global
NEWS

రాధాకృష్ణను చూస్తుంటే టీడీపీ కార్యకర్తలకు సిగ్గేయడం లేదా?

70 ఏళ్ల వయసున్న లక్ష్మీపార్వతిపై మూడు రోజులుగా ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, టీవీ5 నీచంగా ప్రచారం చేస్తుంటే టీడీపీ కార్యకర్తలకు సిగ్గేయడం లేదా అని ప్రశ్నించారు దర్శకుడు పోసాని కృష్ణమురళీ. వృద్ధురాలిపై ఇలాంటి కథనాలు రాసేందుకు సిగ్గులేదా అని నిలదీశారు. చంద్రబాబును ప్రశ్నిస్తే ఎవరిపైన అయినా ఇలాంటి కథనాలే రాస్తున్నారని పోసాని విమర్శించారు. ఈసారి టీడీపీ గెలిస్తే చంద్రబాబును విమర్శించే వారి కుటుంబంలోని ఆడవాళ్లను కూడా వదిలిపెట్టరని పోసాని వ్యాఖ్యానించారు. లక్ష్మీపార్వతి గురించి తప్పుడు కథనాలు రాస్తున్న రాధాకృష్ణకు… నారా లోకేష్ అమ్మాయిలతో తాగి, పడుకున్న ఫొటోలను, […]

రాధాకృష్ణను చూస్తుంటే టీడీపీ కార్యకర్తలకు సిగ్గేయడం లేదా?
X

70 ఏళ్ల వయసున్న లక్ష్మీపార్వతిపై మూడు రోజులుగా ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, టీవీ5 నీచంగా ప్రచారం చేస్తుంటే టీడీపీ కార్యకర్తలకు సిగ్గేయడం లేదా అని ప్రశ్నించారు దర్శకుడు పోసాని కృష్ణమురళీ.

వృద్ధురాలిపై ఇలాంటి కథనాలు రాసేందుకు సిగ్గులేదా అని నిలదీశారు. చంద్రబాబును ప్రశ్నిస్తే ఎవరిపైన అయినా ఇలాంటి కథనాలే రాస్తున్నారని పోసాని విమర్శించారు. ఈసారి టీడీపీ గెలిస్తే చంద్రబాబును విమర్శించే వారి కుటుంబంలోని ఆడవాళ్లను కూడా వదిలిపెట్టరని పోసాని వ్యాఖ్యానించారు.

లక్ష్మీపార్వతి గురించి తప్పుడు కథనాలు రాస్తున్న రాధాకృష్ణకు… నారా లోకేష్ అమ్మాయిలతో తాగి, పడుకున్న ఫొటోలను, అమ్మాయిల నడుముకు తాడు కట్టి తిప్పుతున్న ఫొటోలను ప్రచురించే ధైర్యం ఉందా అని ప్రశ్నించారు. మంగళగిరి ప్రజలు పక్కా తాగుబోతు, తిరుగుబోతు అయిన లోకేష్‌కు ఓటేసే ముందు ఆలోచన చేయాలని విజ్ఞప్తి చేశారు.

మంగళగిరి పదాన్ని మందలగిరి అని పిలవడం, ప్రచారంలో డెంగ్యూ అనే మాటకు బదులు పచ్చి బూతు మాట్లాడే లోకేష్‌కు ఓటేస్తే ఆ తర్వాత సిగ్గుపడాల్సి ఉంటుందన్నారు. నిజాయితీపరుడిని గెలిపించాలనుకుంటే ఎమ్మెల్యే ఆర్కేకు మరోసారి ఓటేయాలని పోసాని కోరారు.

చంద్రబాబు పొత్తు పెట్టుకోని పార్టీ ఏదైనా మిగిలి ఉందా? అని ప్రశ్నించారు. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌తో గొడవ పెట్టుకుంటున్న చంద్రబాబు… మరి మమతా బెనర్జీ, కశ్మీర్‌ మాజీ సీఎం ఫరూక్‌ అబ్దుల్లా, కేజ్రీవాల్‌ను ఎలా తీసుకొస్తున్నారని నిలదీశారు.

First Published:  6 April 2019 9:30 PM GMT
Next Story