Telugu Global
NEWS

ఎన్నికల ప్రచారంలో నిలదీసిన మహిళ.... జారుకున్న నారా లోకేష్

మరి కొన్ని గంటలైతే ఎన్నికల ప్రచారానికి తెరపడబోతోంది. ఎన్నికల బరిలో ఉన్న ప్రతీ నాయకుడు తమ నియోజకవర్గంలో ఊరూరా, వీధీ వీధీ తిరుగుతూ ఓటర్లను వేడుకుంటున్నారు. తమ ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థిస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు తనయుడు నారా లోకేష్ కూడా తను బరిలోకి దిగిన మంగళగిరిలో ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు. ప్రచారాన్ని వేగవంతం చేసిన నారా లోకేష్‌కు ఇవాళ అనుకోని అనుభవం ఎదురైంది. తనకు ఓటు వేయమని ఒక మహిళను అడగ్గా […]

ఎన్నికల ప్రచారంలో నిలదీసిన మహిళ.... జారుకున్న నారా లోకేష్
X

మరి కొన్ని గంటలైతే ఎన్నికల ప్రచారానికి తెరపడబోతోంది. ఎన్నికల బరిలో ఉన్న ప్రతీ నాయకుడు తమ నియోజకవర్గంలో ఊరూరా, వీధీ వీధీ తిరుగుతూ ఓటర్లను వేడుకుంటున్నారు. తమ ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థిస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు తనయుడు నారా లోకేష్ కూడా తను బరిలోకి దిగిన మంగళగిరిలో ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు.

ప్రచారాన్ని వేగవంతం చేసిన నారా లోకేష్‌కు ఇవాళ అనుకోని అనుభవం ఎదురైంది. తనకు ఓటు వేయమని ఒక మహిళను అడగ్గా ఆమె లోకేష్‌ను నిలదీసి కడిగి పారేసింది. మా పొలాలను భూసేకరణ కింద బలవంతంగా లాక్కున్నారని ఆమె మండి పడింది. తర్వాత ఇళ్లు కూడా లాక్కోవడానికి నోటీసులు ఇచ్చారని.. మేం ఎక్కడ ఎలా బతకాలని లోకేష్‌ను ప్రశ్నించింది. దీంతో లోకేష్‌కు ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక అక్కడి నుంచి వెళ్లిపోయారు.

ఇప్పటికే మంగళగిరిలో పలు దఫాలుగా ప్రచారం చేసినా టీడీపీపై వ్యతిరేకత కనబడుతూనే ఉంది. రాజధాని ప్రాంతంలో ఉన్న నియోజకవర్గంలో వ్యతిరేకత ఇంకా తగ్గలేదని ఈ ఘటనే నిరూపిస్తోంది. అంతే కాక ఇవాళ లోకేష్ చేసిన ఎన్నికల ప్రచారానికి ఎక్కడా ప్రజల నుంచి స్పందన లేకపోవడం టీడీపీ శ్రేణులను కలవరపెడుతోంది.

First Published:  8 April 2019 8:43 AM GMT
Next Story