Telugu Global
NEWS

చంద్రబాబుకు షాక్... కాంగ్రెస్‌కు ఓటేయండంటూ జేసీ ప్రచారం

అనంతపురం రాజకీయాలలో జేసీ దివాకర్ రెడ్డిది ప్రత్యేక పాత్ర. ఆ జిల్లా రాజకీయాలను జేసీ కుటుంబమే శాసిస్తుంది అనడంలో అతిశయోక్తి లేదు. ఆది నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్న జేసీ దివాకర్‌రెడ్డి గత ఎన్నికల సమయంలో టీడీపీలో చేరి అనంతపురం ఎంపీగా గెలిచారు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో జేసీ దివాకర్ రెడ్డి పోటీ చేయకున్నా ఆ టికెట్ కొడుకు జేసీ పవన్ రెడ్డికి ఇప్పించుకున్నారు. గత నెల రోజులుగా తన కొడుకు తరపున ప్రచారం చేస్తున్నారు. ఇవాళ […]

చంద్రబాబుకు షాక్... కాంగ్రెస్‌కు ఓటేయండంటూ జేసీ ప్రచారం
X

అనంతపురం రాజకీయాలలో జేసీ దివాకర్ రెడ్డిది ప్రత్యేక పాత్ర. ఆ జిల్లా రాజకీయాలను జేసీ కుటుంబమే శాసిస్తుంది అనడంలో అతిశయోక్తి లేదు. ఆది నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్న జేసీ దివాకర్‌రెడ్డి గత ఎన్నికల సమయంలో టీడీపీలో చేరి అనంతపురం ఎంపీగా గెలిచారు.

ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో జేసీ దివాకర్ రెడ్డి పోటీ చేయకున్నా ఆ టికెట్ కొడుకు జేసీ పవన్ రెడ్డికి ఇప్పించుకున్నారు. గత నెల రోజులుగా తన కొడుకు తరపున ప్రచారం చేస్తున్నారు. ఇవాళ చివరి రోజు కావడంతో నియోజకవర్గ పరిధిలోని నారాయణపురంలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.

రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించాలని చెప్పి చంద్రబాబుకు షాకిచ్చారు. కాంగ్రెస్ పార్టీలో పుట్టి పెరిగిన తనకు ఇంకా ఆ పార్టీపై మమకారం చావలేదని… అందుకే ఈ విన్నపం చేస్తున్నానని అన్నారు. తన కొడుకు టీడీపీ నుంచి పోటీ చేస్తున్నా.. ఈయన మాత్రం కాంగ్రెస్‌కు ఓటేయమని ప్రజలకు స్పష్టం చేశారు. దీంతో అక్కడున్న వాళ్లంతా అవాక్కయ్యారు.

అంతే కాకుండా, తాను ఎంపీగా 100 శాతం ఫెయిల్ అయ్యానని, హిందీ రాకపోవడం వల్లే ఇలా జరిగిందని అంగీకరించారు. తాను స్థానికుడను కాదని చాలా మంది విమర్శిస్తున్నారు. మా కుటుంబం ఏనాడో గద్వాల నుంచి వలస వచ్చి ఇక్కడ స్థిరపడ్డాం. నేను ఇక్కడ పుట్టి పెరిగిన వాడినే.. నేను స్థానికుడనే అని చెప్పుకొచ్చారు.

పోలింగ్‌కు ఇంకా 48 గంటలు మాత్రమే ఉన్న సమయంలో జేసీ చేసిన ఈ వ్యాఖ్యలు అనంతపురంలోనే కాక టీడీపీలో చర్చనీయాంశంగా మారాయి. టీడీపీలో ఉంటూనే పార్టీకి వ్యతిరేకంగా గతంలో కూడా పలు వ్యాఖ్యలు జేసీ చేశారు.

First Published:  9 April 2019 7:20 AM GMT
Next Story