Telugu Global
Cinema & Entertainment

పవన్ వద్దన్నాడు.... అందుకే రాలేదు

ప్రచారం చేయకపోయినా పవన్ ను కలిశారు రామ్ చరణ్, అల్లు అర్జున్. జనసేనానికి వడదెబ్బ తగిలితే పరామర్శించాడు రామ్ చరణ్. ఓ పూట మొత్తం పక్కనే ఉన్నాడు. పనిలో పనిగా గాజుగ్లాస్ వద్ద 2 ఫొటోలకు పోజులిచ్చి ప్రచారానికి సహకరించాడు. అటు బన్నీ కూడా ఇలానే వ్యవహరించాడు. పవన్ తో ఏకంగా ప్రచారం రథం ఎక్కాడు. మాట్లాడకపోయినా పవన్ కు తన మద్దతు ప్రకటించాడు. అయితే ఈ మొత్తం ఎపిసోడ్ నుంచి సాయి ధరమ్ తేజ్ మాత్రం […]

పవన్ వద్దన్నాడు.... అందుకే రాలేదు
X

ప్రచారం చేయకపోయినా పవన్ ను కలిశారు రామ్ చరణ్, అల్లు అర్జున్. జనసేనానికి వడదెబ్బ తగిలితే పరామర్శించాడు రామ్ చరణ్. ఓ పూట మొత్తం పక్కనే ఉన్నాడు. పనిలో పనిగా గాజుగ్లాస్ వద్ద 2 ఫొటోలకు పోజులిచ్చి ప్రచారానికి సహకరించాడు.

అటు బన్నీ కూడా ఇలానే వ్యవహరించాడు. పవన్ తో ఏకంగా ప్రచారం రథం ఎక్కాడు. మాట్లాడకపోయినా పవన్ కు తన మద్దతు ప్రకటించాడు. అయితే ఈ మొత్తం ఎపిసోడ్ నుంచి సాయి ధరమ్ తేజ్ మాత్రం మిస్ అయ్యాడు.

పవన్ అంటే తనకు ఎంతో ఇష్టమని చెప్పే సాయితేజ్.. ప్రచారానికి మాత్రం దూరంగా ఉన్నాడు. పవన్ కు వడదెబ్బ తగిలినా పరామర్శించడానికి రాలేదు. దీనిపై తేజూను మీడియా ప్రశ్నించింది. దానికి సమాధానమిచ్చాడు తేజూ.

“ప్రచారం చేస్తానని పవన్ కల్యాణ్ ను కోరాను. మీరు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తానని చెప్పాను. కానీ పవన్ కల్యాణ్ వద్దన్నారు. కెరీర్ పరంగా చాలా క్రిటికల్ పొజిషన్ లో ఉన్నావు, పూర్తిగా సినిమాలపైనే దృష్టి పెట్టమని సలహా ఇచ్చారు.”

తను వస్తానన్నప్పటికీ పవన్ నో చెప్పడంతో ఆగిపోయానంటున్నాడు సాయి తేజ్. పవన్ చెప్పినట్టు పూర్తిగా సినిమాలపైనే దృష్టిపెడతానని, మంచి కథలు సెలక్ట్ చేసుకుంటానని ప్రకటించాడు. ఈ హీరోకు వరుసగా 6 ఫ్లాపులు వచ్చిన సంగతి తెలిసిందే. అతడు నటించిన చిత్రలహరి సినిమా విడుదలకు సిద్ధమైంది.

First Published:  9 April 2019 8:56 AM GMT
Next Story