Telugu Global
NEWS

తాతా మనవళ్ల ఆటవిడుపు.. లోకేష్ ట్వీట్‌పై నెటిజన్ల ఆసక్తికర కామెంట్లు

తెలుగు దేశం పార్టీని మరో సారి గెలిపించాలని చంద్రబాబు నాయుడు గత నెల రోజులుగా ఊపిరి సలపనంత బిజీగా గడిపారు. దాదాపు 110 బహిరంగ సభలు, రోడ్‌షోలతో అలసిపోయారు. ఎన్నికల వ్యూహ ప్రతివ్యూహాలతో ఇన్నాళ్లూ బిజీగా గడిపిన నారా చంద్రబాబు నాయుడు ఇవాళ కాస్త రిలాక్స్ అయ్యారు. సాయంత్రం పూట తన మనవడు దేవాన్ష్‌తో కలిసి కాసేపు ఆడుకున్నారు. తాడేపల్లి లోని ఆయన నివాసంలో తాతా మనవళ్లు ఆడుకుంటుండగా నారా లోకేష్ ఫొటో తీసి ట్విట్టర్‌లో పెట్టారు. […]

తాతా మనవళ్ల ఆటవిడుపు.. లోకేష్ ట్వీట్‌పై నెటిజన్ల ఆసక్తికర కామెంట్లు
X

తెలుగు దేశం పార్టీని మరో సారి గెలిపించాలని చంద్రబాబు నాయుడు గత నెల రోజులుగా ఊపిరి సలపనంత బిజీగా గడిపారు. దాదాపు 110 బహిరంగ సభలు, రోడ్‌షోలతో అలసిపోయారు.

ఎన్నికల వ్యూహ ప్రతివ్యూహాలతో ఇన్నాళ్లూ బిజీగా గడిపిన నారా చంద్రబాబు నాయుడు ఇవాళ కాస్త రిలాక్స్ అయ్యారు. సాయంత్రం పూట తన మనవడు దేవాన్ష్‌తో కలిసి కాసేపు ఆడుకున్నారు. తాడేపల్లి లోని ఆయన నివాసంలో తాతా మనవళ్లు ఆడుకుంటుండగా నారా లోకేష్ ఫొటో తీసి ట్విట్టర్‌లో పెట్టారు. అంతే కాక ఒక సందేశాన్ని కూడా ఉంచారు.

ప్రజా విజయం కోసం అనుక్షణం ప్రజలతో మమేకమై, విరామం లేకుండా 110 ప్రచార సభలలో పాల్గొన్న చంద్రబాబు గారికి, కుటుంబంతో గడిపేందుకు కాస్త తీరిక దొరికింది. ఇదిగో ఇలా తాతామనవళ్ళు ఇద్దరూ సరదా సమయాన్ని గడుపుతున్నారు.. అంటూ రాశారు.

అయితే ఈ పోస్టుపై నెటిజన్లు పలు రకాలుగా స్పందింస్తున్నారు. తమ తమ కామెంట్లతో టీడీపీ, వైసీపీ అభిమానులు ట్వీట్‌ను వైరల్ చేశారు.

First Published:  10 April 2019 10:53 AM GMT
Next Story