Telugu Global
NEWS

పులివెందులలో జగన్.... అమరావతిలో చంద్రబాబు

ఏపీ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవడానికి పోలింగ్ బూత్‌లకు ఓటర్లు పోటెత్తుతున్నారు. ఎండాకాలం కావడంతో ఉదయాన్నే పోలింగ్ బూత్‌ల వద్ద క్యూ కట్టారు. ప్రముఖులు కూడా ఉదయాన్నే తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి తరలివచ్చారు. అమరావతిలో సీఎం చంద్రబాబు నాయుడు తన కుటుంబంతో సహా వచ్చి ఓటు వేశారు. మరోవైపు ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ పులివెందులలో తన ఓటు వేశారు.   జూబ్లీహిల్స్ రోడ్‌నెంబర్ 33లోని బీఎస్ఎన్ఎల్ కార్యాలయంలో అల్లు అర్జున్ ఓటు […]

పులివెందులలో జగన్.... అమరావతిలో చంద్రబాబు
X

ఏపీ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవడానికి పోలింగ్ బూత్‌లకు ఓటర్లు పోటెత్తుతున్నారు. ఎండాకాలం కావడంతో ఉదయాన్నే పోలింగ్ బూత్‌ల వద్ద క్యూ కట్టారు. ప్రముఖులు కూడా ఉదయాన్నే తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి తరలివచ్చారు.

అమరావతిలో సీఎం చంద్రబాబు నాయుడు తన కుటుంబంతో సహా వచ్చి ఓటు వేశారు. మరోవైపు ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ పులివెందులలో తన ఓటు వేశారు.

జూబ్లీహిల్స్ రోడ్‌నెంబర్ 33లోని బీఎస్ఎన్ఎల్ కార్యాలయంలో అల్లు అర్జున్ ఓటు వేయగా.. మరో పోలింగ్ బూత్‌లో ఎన్టీఆర్ తన కుటుంబ సమేతంగా వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు.

సినీ నటి అక్కినేని అమల ఓటు వేసిన తర్వాత ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఇక్కడ అధికారులు చక్కని వసతులు కల్పించారని ఆమె కొనియాడారు.

First Published:  10 April 2019 10:09 PM GMT
Next Story