Telugu Global
NEWS

పాండ్యా, రాహుల్ లకు చెరో 20 లక్షల రూపాయల జరిమానా

విచారణ అనంతరం తీర్పు చెప్పిన బీసీసీఐ అంబుడ్స్ మన్ పుల్వామా అమరుల కుటుంబాలకు చెరో 10 లక్షలు అంధుల క్రికెట్ సంఘానికి చెరో 10 లక్షలు ఇవ్వాలంటూ తీర్పు కాఫీ విత్ కరణ్ షోలో…. మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన భారత యువక్రికెటర్లు హార్థిక్ పాండ్యా, కెఎల్ రాహుల్ ల పై విచారణ అనంతరం…. బీసీసీఐ చెరో 20 లక్షల జరిమానా విధించింది. ఈ మొత్తాన్ని సామాజిక కార్యక్రమాలకు ఉపయోగించాలని ఆదేశించింది. విచారణ కోసం బీసీసీఐ పాలకమండలి నియమించిన […]

పాండ్యా, రాహుల్ లకు చెరో 20 లక్షల రూపాయల జరిమానా
X
  • విచారణ అనంతరం తీర్పు చెప్పిన బీసీసీఐ అంబుడ్స్ మన్
  • పుల్వామా అమరుల కుటుంబాలకు చెరో 10 లక్షలు
  • అంధుల క్రికెట్ సంఘానికి చెరో 10 లక్షలు ఇవ్వాలంటూ తీర్పు

కాఫీ విత్ కరణ్ షోలో…. మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన భారత యువక్రికెటర్లు హార్థిక్ పాండ్యా, కెఎల్ రాహుల్ ల పై విచారణ అనంతరం…. బీసీసీఐ చెరో 20 లక్షల జరిమానా విధించింది. ఈ మొత్తాన్ని సామాజిక కార్యక్రమాలకు ఉపయోగించాలని ఆదేశించింది.

విచారణ కోసం బీసీసీఐ పాలకమండలి నియమించిన ఆంబుడ్స్ మన్… డికె జైన్ జరిమానా మొత్తాన్ని ఖరారు చేశారు. పుల్వామా అల్లర్లలో అమరులైన పారా మిలిటరీ జవాన్ల భార్యలలో పదిమందికి చెరో లక్ష రూపాయల చొప్పున ఇవ్వాలని… భారత అంధుల క్రికెట్ సంఘానికి చెరో 10 లక్షలు ఇవ్వాలని ఆదేశించారు.

పాండ్యా, రాహుల్ ఇద్దరూ…ఇంగ్లండ్ వేదికగా జరిగే వన్డే ప్రపంచకప్ లో పాల్గొనే భారతజట్టులో చోటు సంపాదించిన సంగతి తెలిసిందే. అంతేకాదు…ప్రస్తుత ఐపీఎల్ లో పంజాబ్ తరపున రాహుల్, ముంబై ఇండియన్స్ జట్టు సభ్యుడిగా హార్ధిక్ పాండ్యా అదరగొడుతున్నారు.

First Published:  20 April 2019 2:50 AM GMT
Next Story