Telugu Global
Cinema & Entertainment

త్రివిక్రమ్ పై సెటైర్ వేసిన సంగీత దర్శకుడు?

కోలీవుడ్ యువ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ తెలుగులో మొట్టమొదటి సారిగా ‘అజ్ఞాతవాసి’ అనే సినిమాతో పరిచయం అయ్యాడు. పవన్ కళ్యాణ్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో విడుదలైన ఈ సినిమా డిజాస్టర్ గా మారిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో త్రివిక్రమ్ దర్శకత్వంతో పాటు అనిరుధ్ అందించిన సంగీతాన్ని కూడా ప్రేక్షకులు ఒక రేంజ్ లో ట్రాల్ చేశారు. ఒక సందర్భంలో త్రివిక్రమ్ కూడా అనిరుధ్ కి తెలుగు మ్యూజిక్ ఎలా ఉంటుందో తెలియదు అని […]

త్రివిక్రమ్ పై సెటైర్ వేసిన సంగీత దర్శకుడు?
X
కోలీవుడ్ యువ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ తెలుగులో మొట్టమొదటి సారిగా ‘అజ్ఞాతవాసి’ అనే సినిమాతో పరిచయం అయ్యాడు. పవన్ కళ్యాణ్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో విడుదలైన ఈ సినిమా డిజాస్టర్ గా మారిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో త్రివిక్రమ్ దర్శకత్వంతో పాటు అనిరుధ్ అందించిన సంగీతాన్ని కూడా ప్రేక్షకులు ఒక రేంజ్ లో ట్రాల్ చేశారు. ఒక సందర్భంలో త్రివిక్రమ్ కూడా అనిరుధ్ కి తెలుగు మ్యూజిక్ ఎలా ఉంటుందో తెలియదు అని చెప్పుకొచ్చారు. అయితే తాజాగా అనిరుధ్ రవిచందర్ నాని హీరోగా నటించిన ‘జెర్సీ’ సినిమాతో మళ్లీ తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంటోంది. బాక్స్ ఆఫీసు వద్ద కాసుల వర్షం కురిపిస్తున్న ఈ సినిమా కు అనిరుధ్ అందించిన సంగీతం మరింత ప్లస్ అయిందని, సినిమాలో ఎమోషన్స్ ను బాగా ఎలివేట్ చేసింది అని ప్రేక్షకులు ప్రశంసిస్తున్నారు. ఈ నేపథ్యంలో అనిరుధ్ రవిచందర్ ‘పేట’ సినిమాలో రజినీకాంత్ చెప్పిన “నా పని అయిపోయింది అనుకుంటున్నావా” అనే డైలాగ్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇలా అనిరుధ్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కు డైరెక్టుగా సెటైర్ వేస్తున్నాడు అంటూ కొందరు వేలెత్తి చూపుతున్నారు. మరి దీనిపై త్రివిక్రమ్ రియాక్ట్ అవుతారో లేదో చూడాలి.
First Published:  21 April 2019 1:59 AM GMT
Next Story