Telugu Global
Cinema & Entertainment

పాత ప్రాజెక్ట్.... కానీ కొత్త అప్ డేట్ !

కుమారి 21 F విడుదల అయ్యి పెద్ద విజయం సాధించిన తరుణం లో చిత్ర యూనిట్ ఒక విజయోత్సవ సభ ని నిర్వహించారు. ఈ సభ లో  సుకుమార్ మాట్లాడుతూ దేవి శ్రీ ప్రసాద్ ని నటుడిగా పరిచయం చేస్తూ ఒక సినిమా చేస్తున్నాను అని అనౌన్స్ కూడా చేశారు. దిల్ రాజు కూడా ఈ సినిమా కి నిర్మాత గా ఉండేందుకు ముందుకు వచ్చారు. ఈ సినిమాకు సంబంధించిన వార్తలు ఒక రెండు మూడు నెలలు బాగానే […]

పాత ప్రాజెక్ట్.... కానీ కొత్త అప్ డేట్ !
X

కుమారి 21 F విడుదల అయ్యి పెద్ద విజయం సాధించిన తరుణం లో చిత్ర యూనిట్ ఒక విజయోత్సవ సభ ని నిర్వహించారు. ఈ సభ లో సుకుమార్ మాట్లాడుతూ దేవి శ్రీ ప్రసాద్ ని నటుడిగా పరిచయం చేస్తూ ఒక సినిమా చేస్తున్నాను అని అనౌన్స్ కూడా చేశారు. దిల్ రాజు కూడా ఈ సినిమా కి నిర్మాత గా ఉండేందుకు ముందుకు వచ్చారు.

ఈ సినిమాకు సంబంధించిన వార్తలు ఒక రెండు మూడు నెలలు బాగానే బయటకు వచ్చాయి. కానీ ఆ తర్వాత అందరూ బిజీ కావడం తో ఆ ప్రాజెక్ట్ ని పక్కన పెట్టేసారు. ఎట్టకేలకు ఈ సినిమా గురించి కొత్త అప్ డేట్ మళ్ళీ బయటకు వచ్చింది.

అయితే ఈ సారి సుకుమార్ ఈ సినిమా కోసం కథ, మాటలు అందజేయనున్నాడట. ఆయన దగ్గర పనిచేసిన ఒక అసిస్టెంట్ డైరెక్టర్ ఈ సినిమా ద్వారా దర్శకుడి గా మారనున్నాడట. దిల్ రాజు తో పాటు సుకుమార్ కూడా తన సొంత బానర్ లో ఈ చిత్రాన్ని నిర్మించనున్నాడు.

ఈ సినిమా ని మరో రెండు నెలల్లో లాంచ్ చేసి షూటింగ్ ని కూడా ఈ ఏడాది చివరి లోపు పూర్తి చేయాలనే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు దర్శక నిర్మాతలు. ఈ సంవత్సరం అయినా దేవి శ్రీ ప్రసాద్ ని మనం నటుడిగా చూస్తామా లేదా అనేది తెలియాలంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే.

First Published:  23 April 2019 4:11 AM GMT
Next Story