Telugu Global
Cinema & Entertainment

రానా సినిమాలో ప్రియమణి

రొటీన్ కథలకు దూరంగా ఉంటూ సరికొత్త కథలను ఎంపిక చేసుకుని ప్రేక్షకులను మెప్పించే పనిలో ఉన్నాడు రానా దగ్గుబాటి. తాజాగా రానా ‘నీది నాది ఒకే కథ’ దర్శకుడు వేణు ఊడుగులతో చేయి కలిపినన సంగతి తెలిసిందే. వీరిద్దరూ ‘విరాటపర్వం 1992’ అనే ఒక ఆసక్తికరమైన పొలిటికల్ థ్రిల్లర్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమాలో డెమోక్రసీ, హ్యూమన్ రైట్స్ మొదలగు విషయాలను కూడా చూపించబోతున్నట్లు సమాచారం. సాయి పల్లవి ఈ సినిమాలో హీరోయిన్ గా […]

రానా సినిమాలో ప్రియమణి
X

రొటీన్ కథలకు దూరంగా ఉంటూ సరికొత్త కథలను ఎంపిక చేసుకుని ప్రేక్షకులను మెప్పించే పనిలో ఉన్నాడు రానా దగ్గుబాటి.

తాజాగా రానా ‘నీది నాది ఒకే కథ’ దర్శకుడు వేణు ఊడుగులతో చేయి కలిపినన సంగతి తెలిసిందే. వీరిద్దరూ ‘విరాటపర్వం 1992’ అనే ఒక ఆసక్తికరమైన పొలిటికల్ థ్రిల్లర్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమాలో డెమోక్రసీ, హ్యూమన్ రైట్స్ మొదలగు విషయాలను కూడా చూపించబోతున్నట్లు సమాచారం. సాయి పల్లవి ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. టబు ఈ సినిమాలో ముఖ్య పాత్ర పోషించబోతోంది.

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో ప్రియమణి కూడా ఒక కీలక పాత్ర పోషించబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే హీరోయిన్ గా తనదైన శైలిలో ప్రేక్షకులను అలరించిన ప్రియమణి గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటోంది.

తాజాగా ప్రకాష్ పులిజాల దర్శకత్వంలో ‘సిరి వెన్నెల’ అనే సినిమాలో నటించబోతున్న ప్రియమణి…. రానా సినిమాలో కూడా ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించబోతున్నాడు అని తెలుస్తోంది.

ఇక ఈ సినిమాను పక్కన పెడితే ప్రియమణి నటిస్తున్న ‘సిరివెన్నెల’ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ సాయి తేజస్విని కూడా నటించబోతోంది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈచిత్రం నిర్మాణాంతర పనులు ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నాయి.

First Published:  30 April 2019 12:29 AM GMT
Next Story