Telugu Global
Cinema & Entertainment

మహర్షి ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా వెంకటేష్

మహేష్ బాబు ప్రస్తుతం తన కెరీర్ లో ని 25 వ చిత్రం తో బిజీ గా ఉన్నాడు. ఈ సినిమా పేరు మహర్షి. ప్రస్తుతం నిర్మాణాంతర పనుల్లో బిజీ గా ఉన్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ రోజు సాయంత్రం ఘనం గా జరగనుంది. సుమారు 16 వేల మంది జనం ఈ ఈవెంట్ కి హాజరు అవుతారు అని తెలుస్తుంది. అయితే ఇండస్ట్రీ లో వినిపిస్తున్న వార్తల ప్రకారం ఈ ఈవెంట్ […]

మహర్షి ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా వెంకటేష్
X

మహేష్ బాబు ప్రస్తుతం తన కెరీర్ లో ని 25 వ చిత్రం తో బిజీ గా ఉన్నాడు. ఈ సినిమా పేరు మహర్షి. ప్రస్తుతం నిర్మాణాంతర పనుల్లో బిజీ గా ఉన్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ రోజు సాయంత్రం ఘనం గా జరగనుంది.

సుమారు 16 వేల మంది జనం ఈ ఈవెంట్ కి హాజరు అవుతారు అని తెలుస్తుంది. అయితే ఇండస్ట్రీ లో వినిపిస్తున్న వార్తల ప్రకారం ఈ ఈవెంట్ కి గతం లో మహేష్ బాబు తో పని చేసిన దర్శకులు అందరూ వచ్చే అవకాశం ఉందట. ఒకవేళ వారు రాలేని పక్షం లో వీడియో బైట్స్ ని పంపుతారట.

ఇదంతా పక్కన పెడితే ఈ ఈవెంట్ కి రామ్ చరణ్ కానీ జూనియర్ ఎన్టీఆర్ కానీ ప్రత్యేక అతిథులు గా వస్తారు అని వార్తలు కూడా వినిపించాయి. అయితే ప్రస్తుతం ఇదే విషయమై చిత్ర యూనిట్ ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ సినిమా ఈవెంట్ కి విక్టరీ వెంకటేష్ ప్రత్యేక అతిథి గా విచ్చేయనున్నారు అని తెలిపింది.

వెంకటేష్ ఇంతకు ముందు మహేష్ తో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు లో పని చేశారు. ఇద్దరు హీరోలకి మంచి స్నేహం ఉన్న విషయం అందరికీ తెలిసిందే. వెంకటేష్ కాకుండా ఈవెంట్ లో ఇంకా చాలా ప్రత్యేకతలు కూడా ఉన్నాయట.

First Published:  1 May 2019 12:42 AM GMT
Next Story