Telugu Global
Cinema & Entertainment

సై రా తో లాభాలు పొందాలనుకుంటున్న నితిన్ తండ్రి?

సై రా నరసింహా రెడ్డి.. ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమలో అందరూ ఎంతో ఆసక్తి గా ఎదురు చూస్తున్న సినిమా ఇది. మెగా స్టార్ చిరంజీవి ఈ సినిమా లో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఇంకా ఈ సినిమా లో అమితాబ్ బచ్చన్, నయనతార, బ్రహ్మాజీ, విజయ్ సేతుపతి, తమన్నా, సుదీప్…. ఇలా ఇంకొంతమంది ప్రధాన పాత్రల్లో మెరుస్తున్నారు. ఈ సినిమా కి సురేందర్ రెడ్డి దర్శకుడు కాగా రామ్ చరణ్ నిర్మాత గా వ్యవహరిస్తున్నారు. అయితే […]

సై రా తో లాభాలు పొందాలనుకుంటున్న నితిన్ తండ్రి?
X

సై రా నరసింహా రెడ్డి.. ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమలో అందరూ ఎంతో ఆసక్తి గా ఎదురు చూస్తున్న సినిమా ఇది. మెగా స్టార్ చిరంజీవి ఈ సినిమా లో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు.

ఇంకా ఈ సినిమా లో అమితాబ్ బచ్చన్, నయనతార, బ్రహ్మాజీ, విజయ్ సేతుపతి, తమన్నా, సుదీప్…. ఇలా ఇంకొంతమంది ప్రధాన పాత్రల్లో మెరుస్తున్నారు. ఈ సినిమా కి సురేందర్ రెడ్డి దర్శకుడు కాగా రామ్ చరణ్ నిర్మాత గా వ్యవహరిస్తున్నారు.

అయితే రామ్ చరణ్ దగ్గరుండి ఈ సినిమాకి సంబంధించిన బిజినెస్ వ్యవహారాలను చూసుకుంటున్నట్లు తెలుస్తోంది. ప్రీ రిలీజ్ బిజినెస్ చాలా ఎక్కువగా ఉంటుంది అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఒక నైజామ్ ఏరియాలోనే రామ్ చరణ్ 25 కోట్లు దాకా చెబుతున్నాడట. అయితే రామ్ చరణ్ ముందు రెండు మూడు అప్షన్స్ ఉన్నాయి…. కానీ ఏదీ ఇంకా ఫైనల్ కాలేదట.

నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి నిర్మాత గా పోగొట్టుకొన్న డబ్బును తిరిగి పంపిణీదారుడిగా సంపాదించాలన్న తపనతో ఉన్నాడట. ఇటీవలే కాంచన-3 ని తీసుకుని మంచి లాభాలు పొందిన తరుణం లో…. రామ్ చరణ్ చెప్పిన ధర కి ‘సైరా’ ని కొనే దిశగా అడుగులు వేస్తున్నాడట. అయితే ఈ ఏరియా లో దిల్ రాజు, ఏషియన్ సునీల్ కూడా ఉన్నా….. సుధాకర్ రెడ్డి కే సినిమా హక్కులు ఇచ్చే అలోచనలో ఉన్నారట.

First Published:  1 May 2019 2:46 AM GMT
Next Story