ఏపీలో ఈ నెల 6న రీపోలింగ్..!
ఏపీలో ఏప్రిల్ 11న అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే పలు రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు అక్కడ ఈ నెల 6న రీపోలింగ్ నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని 5 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ కోసం సీఈసీ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఆదేశాలు జారీ చేసింది. ఆయా నియోజక వర్గాల్లో […]
ఏపీలో ఏప్రిల్ 11న అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే పలు రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు అక్కడ ఈ నెల 6న రీపోలింగ్ నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది.
గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని 5 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ కోసం సీఈసీ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఆదేశాలు జారీ చేసింది. ఆయా నియోజక వర్గాల్లో ఏప్రిల్ 11న హింసాత్మక ఘటనలు చోటు చేసుకోవడంతో పాటు ఈవీఎంలలో పలు ఇబ్బందులు తలెత్తాయి. దీంతో ఆయా కేంద్రాల్లో రీపోలింగ్ కోసం సీఈసీ నిర్ణయం తీసుకుంది.
రీపోలింగ్ జరిగే కేంద్రాలను ఏపీ ఎన్నికల సంఘం ప్రకటించింది. అవి….
- గుంటూరు జిల్లాలోని నరసారావు పేట నియోజకవర్గం కేసానుపల్లి 94వ పోలింగ్ బూత్
- గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలోని నల్లచెరువు 244 పోలింగ్ బూత్
- నెల్లూరు నియోజకవర్గంలోని పల్లెపాలెం ఇసుకపల్లి 41వ పోలింగ్ బూత్
- సూళ్లూరిపేట నియోజకవర్గంలోని అటకానితిప్ప 197 పోలింగ్ బూత్
- యర్రగొండపాలెం నియోజకవర్గంలోని కలనూతల 247 పోలింగ్ కేంద్రం