గెలిస్తే నా వల్లే.... ఓడితే మీరే బాధ్యులు : బాబు
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల తర్వాత చంద్రబాబునాయుడి మానసిక పరిస్థితి దారుణంగా ఉందని తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు వాపోతున్నారు. అధికారానికి దూరం అవుతామనే ఆందోళన చంద్రబాబు నాయుడిలో నానాటికీ పెరుగుతోందని తెలుగు తమ్ముళ్లు తమ సన్నిహితుల వద్ద చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల తర్వాత చంద్రబాబు నాయుడు వివిధ జిల్లాల నాయకులతో నేరుగాను, టెలీకాన్ఫరెన్స్ లోను కూడా మాట్లాడుతున్నారు. రెండు రోజులకు ఒకసారి నిర్వహిస్తున్న ఈ సమావేశాల్లో చంద్రబాబు నాయుడు చెప్పిందే చెప్పి తెలుగు తమ్ముళ్లకు విసుగు […]
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల తర్వాత చంద్రబాబునాయుడి మానసిక పరిస్థితి దారుణంగా ఉందని తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు వాపోతున్నారు.
అధికారానికి దూరం అవుతామనే ఆందోళన చంద్రబాబు నాయుడిలో నానాటికీ పెరుగుతోందని తెలుగు తమ్ముళ్లు తమ సన్నిహితుల వద్ద చెబుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల తర్వాత చంద్రబాబు నాయుడు వివిధ జిల్లాల నాయకులతో నేరుగాను, టెలీకాన్ఫరెన్స్ లోను కూడా మాట్లాడుతున్నారు. రెండు రోజులకు ఒకసారి నిర్వహిస్తున్న ఈ సమావేశాల్లో చంద్రబాబు నాయుడు చెప్పిందే చెప్పి తెలుగు తమ్ముళ్లకు విసుగు తెప్పిస్తున్నారని అంటున్నారు.
తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తాను అనేక కార్యక్రమాలు చేపట్టానని పదే పదే చెప్పడం, వాటి కారణంగానే మనం ఎన్నికల్లో విజయం సాధిస్తామని చెప్పడం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులకు కూడా విసుగు తెప్పిస్తోందని చెబుతున్నారు.
ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధిస్తే అది తన ఘనకార్యమేనని, ఒకవేళ పరాజయం పాలైతే మాత్రం దానికి కారణం కచ్చితంగా పార్టీ నాయకులు, కార్యకర్తలదే బాధ్యత అని చెబుతున్నారంటున్నారు.
ఇలాంటి వ్యాఖ్యల కారణంగా చంద్రబాబు నాయుడి పట్ల గతంలో ఉన్న గౌరవం తగ్గుతోందని తమ్ముళ్లు సన్నిహితుల వద్ద అంటున్నట్లు చెబుతున్నారు.
చంద్రబాబు నాయుడు తన కుమారుడి కోసం పార్టీని, సీనియర్ నాయకులను ఇబ్బందుల పాలు చేస్తున్నారని అంటున్నారు. ఈ ఎన్నికల్లో విజయం సాధించడం కష్టమేనని చంద్రబాబు నాయుడికి నిఘా విభాగం ఇచ్చిన నివేదికలు చెబుతున్నాయని, దీంతో ఇప్పటి నుంచే పరాజయాన్ని నాయకుల మీదకు నెట్టి వేస్తున్నారని అంటున్నారు.
తన పాలన పట్ల ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తం అవుతోందన్న వాస్తవాన్ని గుర్తించకుండా పరాజయం పాలైతే మీరు చేసిన అవినీతే కారణమంటూ నాయకుల మీదకు నెపం వేసేలా చంద్రబాబు నాయుడు ఇప్పటి నుంచే వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారని తెలుగు తమ్ముళ్లు చెబుతున్నారు.