Telugu Global
NEWS

వైసీపీనే గెలుస్తుంది.... టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నిజాలివీ....

ఏపీలో పోలింగ్ ముగిసింది. ప్రజలంతా రిలాక్స్ అవుతున్నారు. కొందరు నేతలు రిలాక్స్ అయ్యి… ఇప్పుడు ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. ప్రధాన పార్టీల్లో ఏదీ గెలుస్తుంది.? ఏ ఎమ్మెల్యే గెలుస్తాడనే టెన్షన్ వెంటాడుతోంది. అయితే తాజాగా టీడీపీ నుంచి పోటీచేసిన ఎమ్మెల్యే అభ్యర్థి వైసీపీ నుంచి పోటీచేసిన అభ్యర్థికి ఫోన్ చేసి ‘మీరే గెలుస్తున్నారు.. మీకు సన్మానం చేస్తాను.. నేరుగా మీ ఇంటికే వస్తాను’ అని అనడం చర్చనీయాంశంగా మారింది.  కృష్ణ జిల్లా గన్నవరం నుంచి టీడీపీ అభ్యర్థిగా […]

వైసీపీనే గెలుస్తుంది.... టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నిజాలివీ....
X

ఏపీలో పోలింగ్ ముగిసింది. ప్రజలంతా రిలాక్స్ అవుతున్నారు. కొందరు నేతలు రిలాక్స్ అయ్యి… ఇప్పుడు ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. ప్రధాన పార్టీల్లో ఏదీ గెలుస్తుంది.? ఏ ఎమ్మెల్యే గెలుస్తాడనే టెన్షన్ వెంటాడుతోంది.

అయితే తాజాగా టీడీపీ నుంచి పోటీచేసిన ఎమ్మెల్యే అభ్యర్థి వైసీపీ నుంచి పోటీచేసిన అభ్యర్థికి ఫోన్ చేసి ‘మీరే గెలుస్తున్నారు.. మీకు సన్మానం చేస్తాను.. నేరుగా మీ ఇంటికే వస్తాను’ అని అనడం చర్చనీయాంశంగా మారింది.

కృష్ణ జిల్లా గన్నవరం నుంచి టీడీపీ అభ్యర్థిగా వల్లభనేని వంశీ పోటీచేశారు. వైసీపీ నుంచి యార్లగడ్డ వెంకట్రావ్ పోటీలో ఉన్నారు. ఇద్దరూ మొన్నటి ఎన్నికల్లో హోరా హోరీగా పోరాడారు. తాజాగా ఫలితాల ముందట టీడీపీ అభ్యర్థి వంశీ నేరుగా వైసీపీ అభ్యర్థి వెంకట్రావ్ కు ఫోన్ చేసి మీరు ఎన్నికల్లో గెలుస్తున్నారు.. మీకు సన్మానం చేస్తాననడం.. మీ ఇంటికే వస్తానని చెప్పడం రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

అయితే వంశీ నేరుగా వెంకట్రావు ఇంటికి వెళ్లగా.. ఆయన ఇంట్లో లేరు. దీంతో వంశీ మరో వైసీపీ నేత బాలవర్ధన్ రావు కు ఫోన్ చేసి మాట్లాడారు.

కానీ ఇక్కడే ట్విస్ట్ నెలకొంది. టీడీపీ అభ్యర్థి వంశీ తమను బెదిరిస్తున్నాడని వైసీపీ నేతలు యార్లగడ్డ వెంకట్రావు, దాసరి బాలవర్ధన్ రావులు విజయవాడ పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు చేయడం గమనార్హం.

అయితే వంశీ తమ మధ్య ఉన్న వివాదాలను పరిష్కరించుకునేందుకే ఇలా చేశాడని ఆయన వర్గీయులు అంటున్నారు.

First Published:  3 May 2019 1:11 AM GMT
Next Story