Telugu Global
Cinema & Entertainment

వెండితెరపైకి మరో పరువు హత్య

పరువు హత్యల నేపథ్యంలో ఇప్పటికే వెండితెరపైకి చాలా సినిమాలొచ్చాయి. మరాఠీలో వచ్చిన సైరాట్ అయితే ఏకంగా క్లాసిక్ అనిపించుకుంది. దాని రీమేక్ గా వచ్చిన దఢక్ కూడా హిట్ అయింది. ఇటు తెలుగులో కూడా పరువు హత్యల కాన్సెప్టుతో కొన్ని సినిమాలు వచ్చాయి. ఇప్పుడు అదే కాన్సెప్ట్ తో మెగా కాంపౌండ్ లో ఓ సినిమా తెరకెక్కుతోంది. సాయి తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా అరంగేట్రం ఇస్తున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ […]

వెండితెరపైకి మరో పరువు హత్య
X

పరువు హత్యల నేపథ్యంలో ఇప్పటికే వెండితెరపైకి చాలా సినిమాలొచ్చాయి. మరాఠీలో వచ్చిన సైరాట్ అయితే ఏకంగా క్లాసిక్ అనిపించుకుంది. దాని రీమేక్ గా వచ్చిన దఢక్ కూడా హిట్ అయింది. ఇటు తెలుగులో కూడా పరువు హత్యల కాన్సెప్టుతో కొన్ని సినిమాలు వచ్చాయి. ఇప్పుడు అదే కాన్సెప్ట్ తో మెగా కాంపౌండ్ లో ఓ సినిమా తెరకెక్కుతోంది.

సాయి తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా అరంగేట్రం ఇస్తున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాకు సుక్కూ శిష్యుడు బుచ్చిబాబు దర్శకుడు. తూర్పు గోదావరి జిల్లాలో యదార్థంగా జరిగిన ఓ పరువు హత్యను బేస్ చేసుకొని ఈ సినిమా కథ రాసుకున్నారు. మూవీ మెయిన్ థీమ్ అదే.

సినిమాలో జాలరిగా కనిపిస్తాడు వైష్ణవ్ తేజ్. అతడు ఓ పెద్దింటి అమ్మాయితో ప్రేమలో పడతాడు. ఆ ప్రేమ అగ్ర కులస్తులకు నచ్చదు. ఇలా సాగుతుందట వైష్ణవ్ తేజ్ సినిమా. ఇందులో విలన్ గా కోలీవుడ్ నటుడు విజయ్ సేతుపతి కనిపించబోతున్నాడు. ఈ సినిమాకు ‘జాలరి’ అనే టైటిల్ అనుకుంటున్నారు.

First Published:  4 May 2019 3:34 AM GMT
Next Story