Telugu Global
Cinema & Entertainment

'సాహో' విషయంలో క్లారిటీ వచ్చేసింది!

‘బాహుబలి’ తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న మొదటి చిత్రం కాబట్టి ‘సాహో’ గురించి  అభిమానులు అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సుజిత్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా గురించిన ఒక వార్త అభిమానులు నిరాశ చెందేలా చేసింది. ఈ మధ్యనే అబూధాబీ లో షూటింగ్ జరిపిన సన్నివేశాలు ప్రభాస్ కు నచ్చలేదని అందుకే ప్రభాస్ దర్శకుడితో కొన్ని సీన్లు రీషూట్ చేయవలసిందిగా చెప్పాడని వార్తలు వచ్చాయి. కానీ ఆ సీన్లు […]

సాహో విషయంలో క్లారిటీ వచ్చేసింది!
X

‘బాహుబలి’ తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న మొదటి చిత్రం కాబట్టి ‘సాహో’ గురించి అభిమానులు అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సుజిత్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు.

తాజాగా ఈ సినిమా గురించిన ఒక వార్త అభిమానులు నిరాశ చెందేలా చేసింది. ఈ మధ్యనే అబూధాబీ లో షూటింగ్ జరిపిన సన్నివేశాలు ప్రభాస్ కు నచ్చలేదని అందుకే ప్రభాస్ దర్శకుడితో కొన్ని సీన్లు రీషూట్ చేయవలసిందిగా చెప్పాడని వార్తలు వచ్చాయి.

కానీ ఆ సీన్లు రీషూట్ చేయాలంటే మళ్లీ అబుదాబి షెడ్యూల్ ప్లాన్ చేయాలని, దానివల్ల సినిమా విడుదల కూడా ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయని అభిమానులు కూడా నిరాశ చెందారు.

కానీ తాజా సమాచారం ప్రకారం ఆ వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని చెబుతున్నారు. ఇప్పటిదాకా వచ్చిన ఔట్ పుట్ తో ప్రభాస్ చాలా సంతోషం గా ఉన్నాడని మరికొన్ని రోజుల్లోనే ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తవుతుందని తెలుస్తోంది. సుజిత్ కూడా నిర్మాణానంతర పనులను మొదలు పెట్టాడు. అనుకున్నట్టుగానే ఆగస్టు 15 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది.

First Published:  4 May 2019 11:31 PM GMT
Next Story