Telugu Global
NEWS

చంద్రబాబు చేయించిన సర్వేలో కేఏపాల్ కు 100 స్థానాలట....

కేఏ పాల్.. మంచి మత ప్రబోధకుడే కాదు.. మంచి రాజకీయ నాయకుడు అని మొన్నటి ఏపీ ఎన్నికల వేళ తెలిసిపోయింది. ఎన్నికల ప్రచారవేళ కేఏ పాల్ చేసిన హంగామా, జోకులు, కామెడీ అంతా ఇంతాకాదు.. ఏపీ ఎన్నికల వేడిలో ఇవి జనాలకు సేదతీర్చాయి. ఇలా పొలిటికల్ ఎంటర్ టైనర్ గా మారిన కేఏ పాల్ ఎన్నికలు ముగియగానే కనిపించకుండా పోయారు. తాజాగా కేఏపాల్ మళ్లీ యాక్టివ్ అయ్యారు. చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడుకు రిటైర్మెంట్ […]

చంద్రబాబు చేయించిన సర్వేలో కేఏపాల్ కు 100 స్థానాలట....
X

కేఏ పాల్.. మంచి మత ప్రబోధకుడే కాదు.. మంచి రాజకీయ నాయకుడు అని మొన్నటి ఏపీ ఎన్నికల వేళ తెలిసిపోయింది. ఎన్నికల ప్రచారవేళ కేఏ పాల్ చేసిన హంగామా, జోకులు, కామెడీ అంతా ఇంతాకాదు.. ఏపీ ఎన్నికల వేడిలో ఇవి జనాలకు సేదతీర్చాయి. ఇలా పొలిటికల్ ఎంటర్ టైనర్ గా మారిన కేఏ పాల్ ఎన్నికలు ముగియగానే కనిపించకుండా పోయారు.

తాజాగా కేఏపాల్ మళ్లీ యాక్టివ్ అయ్యారు. చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడుకు రిటైర్మెంట్ ఇచ్చేసి మనమిద్దరం ప్రజల కోసం కలిసి పనిచేద్దామంటూ వైఎస్ జగన్ కు కేఏపాల్ స్నేహహస్తం అందించారు.

ఇక ఏపీలో ఎవరిని సీఎం చేయాలని నిర్ణయించేది తానేనని కేఏపాల్ గొప్పగా చెప్పుకొచ్చాడు. ఈనెల 23న ఏపీ ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయన్నారు. తాను జోక్ చేయడం లేదని.. ఫలితాల తర్వాత సీఎం ఎవరో తానే డిసైడ్ చేస్తానని ఆయన చెప్పుకొచ్చారు.

ఏపీలో తెలుగుదేశం పార్టీ గెలిచే స్థానాలపై చంద్రబాబు సర్వే చేయించారని పాల్ తెలిపారు. ఆ సర్వేలో ప్రజాశాంతి పార్టీకి 100కు పైగా స్థానాల్లో గెలుస్తుందని వచ్చిందని షాకింగ్ విషయం చెప్పాడు. అందుకే చంద్రబాబుకు రిటైర్ మెంట్ అని చెబుతున్నానన్నారు.

ఇలా పాల్ ఏపీలో ప్రధాన పక్షాలుగా ఉన్న టీడీపీ, వైసీపీలను కాదని.. ఏకంగా ప్రజాశాంతి గెలుస్తుందనడంపై జనాలు నవ్వుకుంటున్నారు. సోదిలోని పార్టీకి 100 స్థానాలా అంటూ పాల్ కు కౌంటరిస్తున్నారు.

First Published:  8 May 2019 12:52 AM GMT
Next Story