Telugu Global
Cinema & Entertainment

మళ్లీ రిపీట్ అవ్వబోతున్న 'నేను శైలజ' కాంబో

‘నేను శైలజ’ సినిమా తో కిషోర్ తిరుమల దర్శకుడిగా మంచి పేరు సంపాదించాడు. ఆ సినిమా హీరో రామ్ కి మాత్రమే కాక కిషోర్ తిరుమల కి కూడా ఇండస్ట్రీలో మంచి బ్రేక్ ఇచ్చింది. ఆ తర్వాత వెంటనే మళ్లీ వీరిద్దరి కాంబినేషన్ లో ‘ఉన్నది ఒకటే జిందగీ’ సినిమా వచ్చింది. కానీ ఆ సినిమా అనుకున్నంత రేంజ్ లో విజయాన్ని సాధించలేకపోయింది. ఇక తాజాగా దర్శకుడు కిషోర్ తిరుమల గత కొంతకాలంగా హిట్ కోసం ఎదురుచూస్తున్న […]

మళ్లీ రిపీట్ అవ్వబోతున్న నేను శైలజ కాంబో
X

‘నేను శైలజ’ సినిమా తో కిషోర్ తిరుమల దర్శకుడిగా మంచి పేరు సంపాదించాడు. ఆ సినిమా హీరో రామ్ కి మాత్రమే కాక కిషోర్ తిరుమల కి కూడా ఇండస్ట్రీలో మంచి బ్రేక్ ఇచ్చింది.

ఆ తర్వాత వెంటనే మళ్లీ వీరిద్దరి కాంబినేషన్ లో ‘ఉన్నది ఒకటే జిందగీ’ సినిమా వచ్చింది. కానీ ఆ సినిమా అనుకున్నంత రేంజ్ లో విజయాన్ని సాధించలేకపోయింది.

ఇక తాజాగా దర్శకుడు కిషోర్ తిరుమల గత కొంతకాలంగా హిట్ కోసం ఎదురుచూస్తున్న సాయి ధరంతేజ్ కు ‘చిత్రలహరి’ అనే సినిమాతో బ్రేక్ ఇచ్చాడు.

తాజా సమాచారం ప్రకారం కిషోర్ తిరుమల ఇప్పుడు మళ్ళీ హీరో రామ్ తో సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. తమిళంలో ఈ మధ్యనే సూపర్ హిట్ అయిన ‘తధం’ సినిమా రామ్ కి బాగా నచ్చిందని, ఆ చిత్ర రీమేక్ రైట్స్ ను రామ్ హోమ్ బ్యానర్ స్రవంతి మూవీస్ వారు తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది.

ఈ సినిమాకి కిషోర్ తిరుమల దర్శకత్వం వహించబోతున్నారట. అయితే ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ప్రస్తుతం రామ్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాలో నిధి అగర్వాల్, నభ నటేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

First Published:  20 May 2019 12:37 AM GMT
Next Story