Telugu Global
Cinema & Entertainment

ముదురుతున్న 2 స్టేట్స్ వివాదం

బాలీవుడ్ లో విడుదల అయి పెద్ద విజయం సాధించిన టూ స్టేట్స్ సినిమా ని తెలుగు లో కి రీమేక్ చేస్తున్నాడు అడివి శేష్. అడవి శేష్ ప్రధాన పాత్రలో శివానీ రాజశేఖర్ ఈ సినిమా తో హీరోయిన్ గా తెరంగేట్రం చేస్తుంది. ఈ సినిమా కి సంబందించిన లాంచ్ ఎప్పుడో జరుగగా, దాదాపు గా 70 శాతం సినిమా షూటింగ్ పూర్తయింది. అయితే ఆ మధ్య హీరో కి దర్శకుడికి మధ్య విభేదాలు రావడం తో […]

ముదురుతున్న 2 స్టేట్స్ వివాదం
X

బాలీవుడ్ లో విడుదల అయి పెద్ద విజయం సాధించిన టూ స్టేట్స్ సినిమా ని తెలుగు లో కి రీమేక్ చేస్తున్నాడు అడివి శేష్.

అడవి శేష్ ప్రధాన పాత్రలో శివానీ రాజశేఖర్ ఈ సినిమా తో హీరోయిన్ గా తెరంగేట్రం చేస్తుంది. ఈ సినిమా కి సంబందించిన లాంచ్ ఎప్పుడో జరుగగా, దాదాపు గా 70 శాతం సినిమా షూటింగ్ పూర్తయింది.

అయితే ఆ మధ్య హీరో కి దర్శకుడికి మధ్య విభేదాలు రావడం తో సినిమా షూటింగ్ నిలిచిపోయింది. ఇది జరిగి దాదాపుగా ఆరు నెలలు కావొస్తుంది. ఇప్పుడు కొత్తగా సినిమా దర్శకుడు వెంకట్ రెడ్డికి మరియు నిర్మాత సత్యనారాయణ కి మధ్య విభేదాలు నడుస్తున్నాయి.

సినిమా నుండి తనని తీసేయాలని చూస్తున్నారు అని, అందుకోసం కోర్టు ని ఆశ్రయించాడు వెంకట్ రెడ్డి. ఇదే విషయాన్ని వెంకట్ మీడియా తో పంచుకున్నారు. “సినిమా మొదలు పెట్టె ముందే హీరో హీరోయిన్ కి కథ చెప్పి వారి అనుమతి తీసుకున్నాను. అయితే ఇప్పటి వరకు తీసిన సినిమా మా అందరికీ సంతృప్తి ని ఇచ్చింది. కాకపోతే ఇపుడు నిర్మాత నా మీద అసత్య ప్రచారం చేస్తూ నన్ను ఈ ప్రాజెక్ట్ నుండి దూరం చేయాలి అని అనుకుంటున్నారు. దానికి నేను ఒప్పుకోను.ఈ సినిమా కి నేను కేవలం దర్శకుడిని మాత్రమే కాదు, భాగస్వామిని మరియు షేర్ హోల్డర్ ని కూడా” అని దర్శకుడు తెలిపాడు.

ఇకనైనా ఇండస్ట్రీ పెద్దలు జోక్యం చేసుకొని ఈ సినిమా ని గట్టెక్కిస్తారేమో చూడాలి.

First Published:  27 May 2019 5:19 AM GMT
Next Story