Telugu Global
Cinema & Entertainment

యాత్ర సినిమాకు సీక్వెల్ వస్తోంది

జగన్ గెలిచినప్పుడే అతడికి అభినందనలు తెలుపుతూ, సీక్వెల్ పై చిన్న హింట్ ఇచ్చాడు దర్శకుడు మహి వి రాఘవ్. ఇప్పుడదే నిజం అయింది. యాత్ర-2 తీయబోతున్నట్టు ప్రకటించాడు మహి. ఈ మేరకు ట్విట్టర్ ఓ ట్వీట్ పెట్టాడు. “రాజారెడ్డి, జగన్ ప్రస్థావన లేకుండా వైఎస్ఆర్ స్టోరీ చెప్పలేం. యాత్ర-2తో అది జరుగుతుంది. యాత్ర సినిమాను జగన్ తో ఎందుకు ముగించామంటే.. ఎక్కడైతే మేం ఆపామో అక్కడ్నుంచి యాత్ర-2 మొదలవుతుంది. వైఎస్ఆర్ యాత్ర ఆయన తండ్రి సమాధి నుంచి […]

యాత్ర సినిమాకు సీక్వెల్ వస్తోంది
X

జగన్ గెలిచినప్పుడే అతడికి అభినందనలు తెలుపుతూ, సీక్వెల్ పై చిన్న హింట్ ఇచ్చాడు దర్శకుడు మహి వి రాఘవ్. ఇప్పుడదే నిజం అయింది. యాత్ర-2 తీయబోతున్నట్టు ప్రకటించాడు మహి. ఈ మేరకు ట్విట్టర్ ఓ ట్వీట్ పెట్టాడు.

“రాజారెడ్డి, జగన్ ప్రస్థావన లేకుండా వైఎస్ఆర్ స్టోరీ చెప్పలేం. యాత్ర-2తో అది జరుగుతుంది. యాత్ర సినిమాను జగన్ తో ఎందుకు ముగించామంటే.. ఎక్కడైతే మేం ఆపామో అక్కడ్నుంచి యాత్ర-2 మొదలవుతుంది. వైఎస్ఆర్ యాత్ర ఆయన తండ్రి సమాధి నుంచి ప్రారంభమౌతుంది. జగన్ యాత్ర వైఎస్ఆర్ ఘాట్ నుంచి మొదలవుతుంది.”

ఇలా యాత్ర సినిమాకు సీక్వెల్ తీయబోతున్న విషయాన్ని అఫీషియల్ గా ప్రకటించాడు మహి వి రాఘవ్. అయితే ఇప్పటివరకు ఈ వివరాలు మాత్రమే మహి వెల్లడించాడు. జగన్ పాత్రలో ఎవరు నటించబోతున్నారనే విషయాన్ని మాత్రం బయటపెట్టలేదు. వైఎస్ఆర్ పాత్రలో మమ్ముట్టి జీవించారు. ప్రతి ప్రేక్షకుడితో కన్నీళ్లు పెట్టించారు. ఆ స్థాయిలో జగన్ పాత్ర కూడా పండాలంటే ఓ యువ నటుడు రావాల్సిందే. అతడెవరనే చర్చ ఇప్పుడు జోరుగా సాగుతోంది.

First Published:  29 May 2019 9:17 PM GMT
Next Story