Telugu Global
Cinema & Entertainment

ఇప్పటికీ ఎన్టీఆర్ సినిమాలు చూస్తుంటాను

బాలీవుడ్ లో కూడా మంచి నటిగా పేరు సంపాదించిన తెలుగమ్మాయి సమీరా రెడ్డి గత కొంతకాలంగా తెలుగు సినిమాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఒకప్పుడు ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘నరసింహుడు’, ‘అశోక్’ వంటి సినిమాలలో హీరోయిన్ గా నటించిన ఈ భామ ‘జై చిరంజీవా’ సినిమా లో చిరంజీవి తో రొమాన్స్ చేసింది. రాజమండ్రి లో పుట్టి పెరిగిన ఈమె ఆఖరిగా ‘కృష్ణం వందే జగద్గురుం’ సినిమాలో ఒక ప్రత్యేక పాత్రలో కనిపించింది. ప్రస్తుతం సమీరా…. […]

ఇప్పటికీ ఎన్టీఆర్ సినిమాలు చూస్తుంటాను
X

బాలీవుడ్ లో కూడా మంచి నటిగా పేరు సంపాదించిన తెలుగమ్మాయి సమీరా రెడ్డి గత కొంతకాలంగా తెలుగు సినిమాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే.

ఒకప్పుడు ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘నరసింహుడు’, ‘అశోక్’ వంటి సినిమాలలో హీరోయిన్ గా నటించిన ఈ భామ ‘జై చిరంజీవా’ సినిమా లో చిరంజీవి తో రొమాన్స్ చేసింది.

రాజమండ్రి లో పుట్టి పెరిగిన ఈమె ఆఖరిగా ‘కృష్ణం వందే జగద్గురుం’ సినిమాలో ఒక ప్రత్యేక పాత్రలో కనిపించింది. ప్రస్తుతం సమీరా…. రెండో బిడ్డకు జన్మనివ్వబోతుంది.

తాజాగా హైదరాబాద్ లో ‘అమ్మతనం’ గురించి జరిగిన ఒక కాన్ఫరెన్స్ కి హాజరైన సమీరా రెడ్డి మీడియాతో ముచ్చటించింది. తాను ఎన్టీఆర్ మంచి ఫ్రెండ్స్ అని చెప్పుకొచ్చింది. “ఇప్పటికీ ఎన్టీఆర్ సినిమాలు ఎప్పుడు రిలీజ్ అయినా చూస్తుంటాను. తను చాలా గొప్ప డ్యాన్సర్” అని సమీరారెడ్డి చెప్పుకొచ్చింది. డెలివరీ తరువాత మళ్ళీ సినిమాల్లోకి రావాలని ఉందని తన కోరికను బయటపెట్టింది సమీరా రెడ్డి.

First Published:  4 Jun 2019 3:21 AM GMT
Next Story