Telugu Global
Cinema & Entertainment

బాలీవుడ్.... టాలీవుడ్.... ఇప్పుడు కోలీవుడ్

బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ ఇప్పటికే తెలుగులో మహేష్ బాబు, రామ్ చరణ్ వంటి స్టార్ హీరోలతో కలిసి నటించింది. ‘భరత్ అనే నేను’ సినిమా హిట్ అయినప్పటికీ బోయపాటి దర్శకత్వం వహించిన ‘వినయ విధేయ రామ’ సినిమా మాత్రం డిజాస్టర్ గా నిలిచింది. ఏదేమైనా కీయార చేతిలో ప్రస్తుతం మూడు బడా ప్రాజెక్టులు ఉన్నాయి. అయితే ఇప్పటిదాకా తెలుగు, హిందీ భాషల్లో బిజీగా ఉన్న ఈ భామ ఇప్పుడు తమిళ ఇండస్ట్రీలో కూడా అడుగుపెట్టబోతోందట. తమిళ […]

బాలీవుడ్.... టాలీవుడ్.... ఇప్పుడు కోలీవుడ్
X

బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ ఇప్పటికే తెలుగులో మహేష్ బాబు, రామ్ చరణ్ వంటి స్టార్ హీరోలతో కలిసి నటించింది. ‘భరత్ అనే నేను’ సినిమా హిట్ అయినప్పటికీ బోయపాటి దర్శకత్వం వహించిన ‘వినయ విధేయ రామ’ సినిమా మాత్రం డిజాస్టర్ గా నిలిచింది. ఏదేమైనా కీయార చేతిలో ప్రస్తుతం మూడు బడా ప్రాజెక్టులు ఉన్నాయి.

అయితే ఇప్పటిదాకా తెలుగు, హిందీ భాషల్లో బిజీగా ఉన్న ఈ భామ ఇప్పుడు తమిళ ఇండస్ట్రీలో కూడా అడుగుపెట్టబోతోందట. తమిళ దర్శకనిర్మాతలు ఈమెను తమిళంలో పరిచయం చేయాలని ప్రయత్నిస్తున్నారని సమాచారం.

ఈ నేపథ్యంలో ఒక ప్రముఖ నిర్మాణ సంస్థ…. శివకార్తికేయన్ సరసన తీసుకునే ఆలోచనలో ఉన్నారట. మరి కియారా అద్వానీ ఈ సినిమాకు సైన్ చేస్తుందో లేదో ఇంకా తెలియాల్సి ఉంది.

ఒకవేళ ఈమె ఈ సినిమాలో నటించడానికి ఒప్పుకుంటే ఇది తమిళంలో ఆమెకు మొదటి చిత్రం అవుతుంది. మరోవైపు బాలీవుడ్ లో ఒక కీయార సిద్ధార్థ్ మల్హోత్రా తో ఒక సినిమా చేస్తుంది. అక్షయ్ కుమార్ సరసన ‘గుడ్ న్యూస్’ అనే సినిమాలో కూడా అలరించనున్న ఈ భామ ‘అర్జున్ రెడ్డి’ హిందీ రీమేక్ ‘కబీర్ సింగ్’ లో కూడా హీరోయిన్ గా నటించింది.

First Published:  6 Jun 2019 2:00 AM GMT
Next Story