Telugu Global
Cinema & Entertainment

వైరల్ వార్తపై క్లారిటీ ఇచ్చిన పృధ్వి

త్రివిక్రమ్-అల్లు అర్జున్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా నుంచి థర్టీ ఇయర్స్ పృధ్విని తప్పించారనే వార్త 2 రోజులుగా వైరల్ అవుతోంది. ఎట్టకేలకు దీనిపై పృధ్వి క్లారిటీ ఇచ్చారు. ఆ వార్తలో నిజం లేదంటున్నారు. ఈ మేరకు ఓ వీడియో విడుదల చేశారు. “ఇప్పుడే నేను వేరే పనిమీద బయటకు వెళ్లి వచ్చాను. నా గురించి నెట్ లో ఏదో వైరల్ అవుతోందట. ఏంటా అని చూస్తే త్రివిక్రమ్ సినిమా నుంచి నన్ను తీసేశారట. అత్తారింటికి దారేది […]

వైరల్ వార్తపై క్లారిటీ ఇచ్చిన పృధ్వి
X

త్రివిక్రమ్-అల్లు అర్జున్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా నుంచి థర్టీ ఇయర్స్ పృధ్విని తప్పించారనే వార్త 2 రోజులుగా వైరల్ అవుతోంది. ఎట్టకేలకు దీనిపై పృధ్వి క్లారిటీ ఇచ్చారు. ఆ వార్తలో నిజం లేదంటున్నారు. ఈ మేరకు ఓ వీడియో విడుదల చేశారు.

“ఇప్పుడే నేను వేరే పనిమీద బయటకు వెళ్లి వచ్చాను. నా గురించి నెట్ లో ఏదో వైరల్ అవుతోందట. ఏంటా అని చూస్తే త్రివిక్రమ్ సినిమా నుంచి నన్ను తీసేశారట. అత్తారింటికి దారేది సినిమా తర్వాత త్రివిక్రమ్ ను నేను అసలు కలవలేదు. ఓసారి ల్యాబ్ లో కనిపిస్తే హలో అన్నాను. ఈమధ్యే కొత్త గెటప్ ఫొటోలుంటే వాట్సాప్ లో పంపించమన్నారు. అంతకుమించి ఇంకేంలేదు. ఈలోగానే ఈ వార్తలు ఎలా వచ్చాయో అర్థం కావడం లేదు. అనవసరంగా వైరల్ చేశారు.”

ఇది రూమర్ అనుకోవాలో, కక్ష సాధింపు చర్య అనుకోవాలో అర్థం కావడం లేదన్న పృధ్వి… ఈ పుకారు పుట్టించిన వ్యక్తుల విజ్ఞతకే వదిలేస్తున్నానని తెలిపారు. తనకు ఆ సినిమాకు మొదట్నుంచీ సంబంధం లేదని స్పష్టంచేశారు.

ఈమధ్య మెగా కాంపౌండ్ పై పృధ్వి తీవ్ర ఆరోపణలు చేశారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయినప్పుడు కనీసం అభినందించడానికి నోరు రాలేదా అంటూ పేర్లు చెప్పి మరీ మెగా హీరోల్ని విమర్శించారు. ఆ కోపంతో త్రివిక్రమ్-బన్నీ సినిమా నుంచి పృధ్విని తప్పించారంటూ పుకార్లు మొదలయ్యాయి. పృధ్వి స్టేట్ మెంట్ తో ఈ పుకార్లకు చెక్ పడుతుందేమో చూడాలి.

First Published:  20 Jun 2019 12:10 AM GMT
Next Story