Telugu Global
NEWS

నెరవేరని బాబు చాంబర్‌ కల...

ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత తన భవనాలు ఏమవుతాయి? అనుకున్న చాంబర్‌ దక్కుతుందా? లేదా? అన్న దానిపై చంద్రబాబు దృష్టి ఉంది. కరకట్ట అక్రమ కట్టడం ప్రజావేదిక తనకే ఇవ్వాలని తొలి లేఖగా ప్రభుత్వానికి చంద్రబాబు రాశారు. ఆ తర్వాత అసెంబ్లీలో చాంబర్ల విషయంలోనూ టీడీపీ పట్టుపట్టింది. ప్రతిపక్ష నేత హోదాలో గతంలో జగన్‌కు కేటాయించిన చాంబర్‌ను ప్రస్తుత చంద్రబాబుకు ప్రతిపక్ష నేత హోదాలో ఇవ్వాలని టీడీపీ డిమాండ్ చేస్తూ వచ్చింది. వర్షం వస్తే జలపాతాన్ని తలపించే ఆ […]

నెరవేరని బాబు చాంబర్‌ కల...
X

ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత తన భవనాలు ఏమవుతాయి? అనుకున్న చాంబర్‌ దక్కుతుందా? లేదా? అన్న దానిపై చంద్రబాబు దృష్టి ఉంది. కరకట్ట అక్రమ కట్టడం ప్రజావేదిక తనకే ఇవ్వాలని తొలి లేఖగా ప్రభుత్వానికి చంద్రబాబు రాశారు. ఆ తర్వాత అసెంబ్లీలో చాంబర్ల విషయంలోనూ టీడీపీ పట్టుపట్టింది.

ప్రతిపక్ష నేత హోదాలో గతంలో జగన్‌కు కేటాయించిన చాంబర్‌ను ప్రస్తుత చంద్రబాబుకు ప్రతిపక్ష నేత హోదాలో ఇవ్వాలని టీడీపీ డిమాండ్ చేస్తూ వచ్చింది. వర్షం వస్తే జలపాతాన్ని తలపించే ఆ చాంబర్‌ కోసం టీడీపీ ఎందుకు పాకులాడుతోంది అంటే వాస్తు కారణమని చెప్పారు.

చంద్రబాబు ఓడిపోయిన తర్వాత వాస్తు పండితులు… జగన్ ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పటి అసెంబ్లీలోని చాంబర్‌ వాస్తు అద్బుతంగా ఉందని… ఆ చాంబర్‌లో ఉన్న వారు మెల్లగా అధికారానికి దగ్గరవుతారని చంద్రబాబు సన్నిహిత వాస్తు పండితులు వివరించారు. అప్పటి నుంచి ఆ చాంబర్‌ కోసం టీడీపీ ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తూ వచ్చింది.

అయితే ప్రభుత్వం అందుకు భిన్నంగా నిర్ణయం తీసుకుంది. గతంలో డిప్యూటీ స్పీకర్‌ బుద్దప్రసాద్‌కు కేటాయించిన చాంబర్‌ను చంద్రబాబుకు కేటాయించారు. జగన్ ప్రతిపక్ష నేత హోదాలో ఉపయోగించిన చాంబర్‌ను ప్రస్తుత డిప్యూటీ స్పీకర్‌ కోన రఘుపతికి అప్పగించారు.

దాంతో మెల్లగా అధికారానికి దగ్గర చేసే జలపాత గది టీడీపీ అధినేతకు దక్కలేదని టీడీపీ నేతలు అసంతృప్తితో ఉన్నారు.

అయితే ఇక్కడ ఆశ్చర్యం ఏమిటంటే… చంద్రబాబు వెంట వాస్తు పండితులు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనూ ఉన్నారు. కానీ జలధార చాంబర్‌లో ఉన్న వారు అధికారానికి మెల్లగా దగ్గరవుతారని ముందే ఎందుకు చెప్పులేదు అన్నది ప్రశ్న. వాస్తు పండితులకు కూడా బాబు పాలన నచ్చలేదనుకోవాలా? అని కొందరు అంటున్నారు.

First Published:  19 Jun 2019 10:03 PM GMT
Next Story