Telugu Global
Cinema & Entertainment

మరోసారి తెరపైకి సుప్రీమ్ జోడీ

సుప్రీమ్ జోడీ మళ్లీ కలిసింది. గతంలో సాయి తేజ్, రాశిఖన్నా కలిసి నటించిన సుప్రీమ్ సినిమా సూపర్ హిట్ అయింది. ఆ మూవీ తర్వాత మరోసారి ఈ జంట కలిసింది. మారుతి దర్శకత్వంలో సాయితేజ్ హీరోగా రాశిఖన్నా హీరోయిన్ గా కొత్త సినిమా స్టార్ట్ అయింది. ఫిలింనగర్ దైవ సన్నిధానంలో ఈ సినిమాకు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. #PratiRojuPandaage @GeethaArts @UV_Creations @DirectorMaruthi @RaashiKhanna @MusicThaman #jaykumar new beginnings…need all your blessings #SDT12 pic.twitter.com/UjuHOIMGsg […]

మరోసారి తెరపైకి సుప్రీమ్ జోడీ
X

సుప్రీమ్ జోడీ మళ్లీ కలిసింది. గతంలో సాయి తేజ్, రాశిఖన్నా కలిసి నటించిన సుప్రీమ్ సినిమా సూపర్ హిట్ అయింది. ఆ మూవీ తర్వాత మరోసారి ఈ జంట కలిసింది. మారుతి దర్శకత్వంలో సాయితేజ్ హీరోగా రాశిఖన్నా హీరోయిన్ గా కొత్త సినిమా స్టార్ట్ అయింది. ఫిలింనగర్ దైవ సన్నిధానంలో ఈ సినిమాకు పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

యూవీ క్రియేషన్స్, గీతాఆర్ట్స్-2 బ్యానర్లపై రాబోతున్న ఈ సినిమాకు ప్రతిరోజూ పండగే అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ సినిమాకు దిల్ రాజు క్లాప్ కొట్టగా, అల్లు అరవింద్ కెమెరా స్విచాన్ చేశారు. బన్నీ వాస్ నిర్మించనున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందించబోతున్నాడు. అల్లు అరవింద్ ప్రజెంట్ చేయనున్నారు.

గీతాఆర్ట్స్-2, యూవీ క్రియేషన్స్ బ్యానర్లపై మారుతి దర్శకత్వంలో గతంలో భలే భలే మగాడివోయ్ సినిమా వచ్చి సూపర్ హిట్ అయింది. మళ్లీ ఇన్నేళ్లకు వీళ్లంతా కలిసి సాయితేజ్ ను హీరోగా పెట్టి ఈ సినిమా ప్లాన్ చేశారు. ఇందులో రెండు కీలక పాత్రల కోసం రావురమేష్, సత్యరాజ్ ను ఎంపిక చేశారు. వచ్చేనెల నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఉంటుంది. మ్యూజిక్ సిట్టింగ్స్ త్వరలోనే ప్రారంభం అవుతాయి.

First Published:  24 Jun 2019 10:55 PM GMT
Next Story