Telugu Global
NEWS

ఇంటర్ విద్యార్థులకూ 'అమ్మఒడి'

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన నవరత్నాల్లో భాగమైన అమ్మఒడి పథకాన్ని మరింత మంది విద్యార్థులకు లబ్ది చేకూరేలా విస్తరించారు. ఇప్పటి వరకు పదవ తరగతి వరకు ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకే పరిమితం చేసిన ఈ పథకానికి సవరణలు చేశారు. ఇవాళ విద్యాశాఖపై సీఎం జగన్ చేసిన సమీక్ష అనంతరం ఈ సవరణలు రూపొందించారు. ఇకపై ఇంటర్ విద్యార్థులతో పాటు హాస్టల్స్‌లో ఉండే విద్యార్థులకు కూడా అమ్మఒడి పథకం ద్వారా ఏడాదికి 15వేల రూపాయల […]

ఇంటర్ విద్యార్థులకూ అమ్మఒడి
X

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన నవరత్నాల్లో భాగమైన అమ్మఒడి పథకాన్ని మరింత మంది విద్యార్థులకు లబ్ది చేకూరేలా విస్తరించారు. ఇప్పటి వరకు పదవ తరగతి వరకు ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకే పరిమితం చేసిన ఈ పథకానికి సవరణలు చేశారు.

ఇవాళ విద్యాశాఖపై సీఎం జగన్ చేసిన సమీక్ష అనంతరం ఈ సవరణలు రూపొందించారు. ఇకపై ఇంటర్ విద్యార్థులతో పాటు హాస్టల్స్‌లో ఉండే విద్యార్థులకు కూడా అమ్మఒడి పథకం ద్వారా ఏడాదికి 15వేల రూపాయల చొప్పున అందనుంది.

ఈ పథకాన్ని ఇంటర్ విద్యార్థులకు కూడా విస్తరించడం ద్వారా పదవ తరగతి తర్వాత ఉండే డ్రాపవుట్స్‌ను తగ్గించే అవకాశం ఉన్నట్లు అధికారులు సూచించడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

First Published:  27 Jun 2019 5:44 AM GMT
Next Story