Telugu Global
NEWS

వింబుల్డన్ టాప్ సీడ్లుగా జోకోవిచ్, బార్టీ

ఫెదరర్ కు రెండు, నడాల్ కు మూడు సీడింగ్స్  కెర్బర్ కు ఐదు, సెరెనాకు 11 సీడింగ్స్ 2019 వింబుల్డన్ టెన్నిస్ సీడింగ్స్ ను నిర్వాహక సంఘం అధికారికంగా ప్రకటించింది. జూన్ 30 నుంచి ప్రారంభమయ్యే ఈ రాయల్ టోర్నీ పురుషుల, మహిళల సింగిల్స్ లో…ప్రపంచ టాప్ ర్యాంక్ ప్లేయర్లు నొవాక్ జోకోవిచ్, యాష్లీగీ బార్టీ లకు టాప్ సీడింగ్స్ ఇచ్చారు. ఎనిమిదిసార్లు విజేత రోజర్ ఫెదరర్ కు రెండు, 12సార్లు ఫ్రెంచ్ ఓపెన్ విన్నర్ రాఫెల్ […]

వింబుల్డన్ టాప్ సీడ్లుగా జోకోవిచ్, బార్టీ
X
  • ఫెదరర్ కు రెండు, నడాల్ కు మూడు సీడింగ్స్
  • కెర్బర్ కు ఐదు, సెరెనాకు 11 సీడింగ్స్

2019 వింబుల్డన్ టెన్నిస్ సీడింగ్స్ ను నిర్వాహక సంఘం అధికారికంగా ప్రకటించింది. జూన్ 30 నుంచి ప్రారంభమయ్యే ఈ రాయల్ టోర్నీ పురుషుల, మహిళల సింగిల్స్ లో…ప్రపంచ టాప్ ర్యాంక్ ప్లేయర్లు నొవాక్ జోకోవిచ్, యాష్లీగీ బార్టీ లకు టాప్ సీడింగ్స్ ఇచ్చారు.

ఎనిమిదిసార్లు విజేత రోజర్ ఫెదరర్ కు రెండు, 12సార్లు ఫ్రెంచ్ ఓపెన్ విన్నర్ రాఫెల్ నడాల్ కు మూడు సీడింగ్స్ దక్కాయి.
సౌతాఫ్రికా ప్లేయర్ కెవిన్ యాండర్సన్ 5వ సీడ్ గా బరిలోకి దిగనున్నాడు.

బార్టీకి టాప్ సీడింగ్…

మహిళల సింగిల్స్ లో ఫ్రెంచ్ ఓపెన్ విన్నర్ యాష్లీగీ బార్టీకి టాప్ సీడింగ్ దక్కింది. ఆస్ట్రేలియా ప్లేయర్ బార్టీ కెరియర్ లో టాప్ సీడింగ్ స్టార్ గా టైటిల్ వేటకు దిగటం ఇదే మొదటిసారి.

డిఫెండింగ్ చాంపియన్ ఏంజెలికో కెర్బర్ ను 5వ సీడ్ గా నిర్ణయించారు. నవోమీ ఒసాకాకు రెండు, ఏడుసార్లు విజేత సెరెనా విలియమ్స్ కు 11 సీడ్లు లభించాయి.

భారీ ప్రైజ్ మనీ….

గ్రాండ్ స్లామ్ టెన్నిస్ సర్క్యూట్ లోనే అత్యంత పురాతన టోర్నీ వింబుల్డన్ ప్రైజ్ మనీ మరింత పెరిగింది. లండన్ లోని ఆల్ ఇంగ్లండ్ క్లబ్ వేదికగా జులై 14 వరకూ జరిగే టోర్నీలో..మొత్తం 309 కోట్ల రూపాయలు ప్రైజ్ మనీగా ఇవ్వాలని నిర్వాహక సంఘం నిర్ణయించింది. 2017 వింబుల్డన్ విజేతలకు ఇచ్చిన నగదు బహుమతి కంటే ఇది 7.6 శాతం ఎక్కువ.

విజేతకు 20 కోట్ల 50 లక్షల నజరానా

పురుషుల, మహిళల సింగిల్స్ లో విజేతలుగా నిలిచిన ప్లేయర్లకు 20 కోట్ల 50 లక్షల రూపాయల చొప్పున ప్రైజ్ మనీగా అందచేస్తారు.

2017 వింబుల్డన్ విన్నర్ రోజర్ ఫెదరర్ 20 కోట్ల 5 లక్షల రూపాయలు మాత్రమే అందుకొన్నాడు. 2018 టోర్నీ విజేత జోకోవిచ్ 20 కోట్ల 50 లక్షల రూపాయలు సొంతం చేసుకొన్నాడు.

వింబుల్డన్ తొలిరౌండ్లోనే ఓటమి పొందిన క్రీడాకారులకు సైతం 35 లక్షల రూపాయలు ప్రైజ్ మనీ అందేలా ఏర్పాట్లు చేశారు.
అంతేకాదు…మెయిన్ డ్రా తొలిరౌండ్లో గాయం సాకుతో అర్థంతరంగా వైదొలిగే క్రీడాకారులకు 50 శాతం మాత్రమే ప్రైజ్ మనీ ఇవ్వటానికి వీలుగా ..ఫిఫ్టీ- ఫిఫ్టీ నిబంధన ప్రవేశపెట్టారు.

వింబుల్డన్ లో ఓపెన్ ఎరా ప్రారంభమై ఐదు దశాబ్దాలు పూర్తి కావడం…వింబుల్డన్ లో మహిళా టెన్నిస్ ప్రవేశపెట్టి 126 సంవత్సరాలు కావడం కూడా మైలురాళ్లుగా మిగిలిపోనున్నాయి. గ్రాండ్ స్లామ్ టెన్నిస్ చరిత్రలో…పచ్చిక కోర్టుల్లో జరిగే ఏకైక టెన్నిస్ టోర్నీ వింబుల్డన్ మాత్రమే.

First Published:  26 Jun 2019 8:50 PM GMT
Next Story